News October 22, 2024
CM కాన్వాయ్.. సామాన్యులు ఆగనక్కర్లేదు!

TG: గతంలో CM కాన్వాయ్ వచ్చే మార్గంలో ఇతర వాహనాలను అనుమతించేవారు కాదు. అయితే CM రేవంత్ ఉన్న జూబ్లీహిల్స్ ప్రాంతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ఆయన పలు మార్పులను పోలీసులకు సూచించారు. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో ఇతర వాహనాలను ఆపొద్దని చెప్పారు. దీంతో ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో వీలైనంతవరకు వాహనాలను అనుమతిస్తున్నారు. డివైడర్కు అవతలివైపున్న వాహనాలనూ పంపిస్తున్నారు.
Similar News
News October 24, 2025
శివుడి మాట కాదని పుట్టింటికి వెళ్లిన సతీదేవి

దక్షప్రజాపతి తాను చేయబోయే యజ్ఞానికి సమస్త దేవతలను, రుషులను, బంధువులను ఆహ్వానించాడు. కానీ కన్న కూతురైన సతీదేవిని, అల్లుడు శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి, శివుడు వద్దన్నా పుట్టింటికి బయలుదేరింది. తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో నందీశ్వరుని అనుమతి తీసుకుని, శివగణాలను వెంటబెట్టుకుని దక్షప్రజాపతి ఇంటికి చేరింది. శివుడు చెప్పినట్లే ఆమెకు అక్కడ అవమానం ఎదురైంది. <<-se>>#Shakthipeetham<<>>
News October 24, 2025
వైన్స్లకు 95,285 దరఖాస్తులు

TG: రాష్ట్రంలో 2,620 మద్యం షాపుల కోసం 95,285 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2023లో 1.31 లక్షల దరఖాస్తులు రాగా ఈ సారి దాదాపు 36వేలు తగ్గాయి. కాగా ఫీజు రూ.3 లక్షలకు పెంచడం, ఏపీ మద్యం పాలసీ ఎఫెక్ట్ వంటివి దరఖాస్తులు తగ్గడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈసారి అప్లికేషన్లతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,858 కోట్ల ఆదాయం సమకూరుతుంది.
News October 24, 2025
PKL: టాప్-4లో తెలుగు టైటాన్స్

ప్రోకబడ్డీ లీగ్ 12వ సీజన్లో ప్లేఆఫ్(టాప్-8) జట్లు ఖరారయ్యాయి. టాప్-4లో పుణేరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో హరియాణా స్టీలర్స్, యూ ముంబా, పాట్నా పైరెట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ ఉన్నాయి. రేపు జరిగే ప్లే ఆఫ్ మ్యాచుల్లో హరియాణా-జైపూర్, యూ ముంబా-పింక్ పాంథర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నెల 26న బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ పోటీ పడనుంది.


