News April 2, 2025
‘తల్లికి వందనం’ వారికే ఇవ్వాలని చెప్తే CM ఒప్పుకోలేదు: జ్యోతుల నెహ్రూ

AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకే ‘తల్లికి వందనం’ అమలు చేయాలని CM చంద్రబాబుకు చెబితే ఆయన ఒప్పుకోలేదని MLA జ్యోతుల నెహ్రూ తెలిపారు. దీంతో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరుగుతాయని చెప్పినా వినలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ పథకం వర్తింపజేస్తామని సీఎం చెప్పినట్లు వివరించారు. కాగా, జూన్ 12లోపు ‘తల్లికి వందనం’ అమలు చేస్తామని నిన్న మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన విషయం తెలిసిందే.
Similar News
News October 18, 2025
పాక్ దాడుల్లో 8 మంది అప్గాన్ క్రికెటర్లు మృతి!

పాక్ జరిపిన వైమానిక దాడుల్లో అప్గానిస్థాన్ క్లబ్ లెవల్ క్రికెటర్లు 8మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అప్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. మరో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. మ్యాచులు పూర్తయ్యాక క్రికెటర్లు పక్టికాలోని షరానా నుంచి అర్గోన్కు వెళ్తుండగా బాంబు దాడులకు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో పౌరులు, చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
News October 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 18, 2025
సీజ్ఫైర్కు తూట్లు.. అఫ్గాన్పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్

పాక్-అఫ్గాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దోహాలో చర్చలు ముగిసే వరకు పొడిగించారు. కానీ, పాక్ మాత్రం పక్టికా ప్రావిన్స్లోని అర్గున్, బర్మాల్ జిల్లాల్లో నివాస ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. దీనిని తాలిబన్ సీనియర్ లీడర్ ఖండించారు. ‘పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మేము కచ్చితంగా బుద్ధి చెప్తాం’ అని పేర్కొన్నారు.