News April 2, 2025

‘తల్లికి వందనం’ వారికే ఇవ్వాలని చెప్తే CM ఒప్పుకోలేదు: జ్యోతుల నెహ్రూ

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకే ‘తల్లికి వందనం’ అమలు చేయాలని CM చంద్రబాబుకు చెబితే ఆయన ఒప్పుకోలేదని MLA జ్యోతుల నెహ్రూ తెలిపారు. దీంతో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరుగుతాయని చెప్పినా వినలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ పథకం వర్తింపజేస్తామని సీఎం చెప్పినట్లు వివరించారు. కాగా, జూన్ 12లోపు ‘తల్లికి వందనం’ అమలు చేస్తామని నిన్న మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన విషయం తెలిసిందే.

Similar News

News December 26, 2025

మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News December 26, 2025

కోల్ ఇండియా లిమిటెడ్‌లో 125 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

<>కోల్ <<>>ఇండియా లిమిటెడ్ 125 ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA/CMA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.22వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.coalindia.in/

News December 26, 2025

లక్ష్మీదేవి కటాక్షం కోసం నేడు ఏం చేయాలంటే?

image

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం రోజున ఉప్పు కొనాలని పండితులు చెబుతున్నారు. అలాగే పడుకునేటప్పుడు ఈశాన్యంలో దీపం వెలిగించడం, ఆవులకు నెయ్యి, బెల్లం కలిపిన ఆహారం OR గడ్డి తినిపించడం మంచిదని అంటున్నారు. ‘లక్ష్మీదేవికి పూలను సమర్పించాలి. వైవాహిక జీవితంలో ఆనందం కోసం గులాబీలు ఇవ్వాలి. సాయంత్రం పంచముఖి దీపం వెలిగించి, కర్పూరం హారతి బూడిదను పర్సులో ఉంచుకుంటే చేతిలో డబ్బు నిలుస్తుంది’ అని చెబుతున్నారు.