News November 6, 2024

వర్రా రవీంద్రను వదిలేయడంపై సీఎం సీరియస్

image

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి 41ఏ నోటీసులిచ్చి పోలీసులు వదిలేయడంపై సీఎం చంద్రబాబు, డీజీపీ తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కడప ఎస్పీతో కర్నూలు రేంజ్ DIG సమావేశమై రవీంద్ర కేసుపై చర్చించారు. మరో కేసులో రవీంద్రాను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వర్రాపై మంగళగిరి, HYDలో కేసులున్నాయి.

Similar News

News January 29, 2026

అమెరికా-చైనా పోటీ.. ఇండియాకు బిగ్ వార్నింగ్!

image

ప్రపంచంలో కీలకమైన శక్తిగా భారత్ ఎదగాలని ఆర్థిక సర్వే సూచించింది. లేదంటే టెక్నాలజీ పరంగా ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి రావొచ్చని హెచ్చరించింది. ప్రపంచం ఆయిల్, స్టీల్ కాలం నుంచి ‘కంప్యూట్’ పవర్ కాలంలోకి ప్రవేశించిందని తెలిపింది. US సెమీకండక్టర్లు, AI, కీలక ఖనిజాలపై పట్టు సాధిస్తుంటే చైనా దీటుగా స్పందిస్తోందని పేర్కొంది. వీటి పోరు మధ్య భారత్ కేవలం ‘బ్యాక్ ఆఫీస్’లా మిగిలిపోవద్దని స్పష్టం చేసింది.

News January 29, 2026

ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ గురించి తెలుసా?

image

ప్రెగ్నెన్సీలో మహిళలు మద్యం తాగడం వల్ల బిడ్డకు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీంతో శిశువుకు శారీరక, మానసిక లోపాలు ఏర్పడతాయంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకుంటే అది పిండంలోకి సులువుగా చేరుతుంది. కాలేయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆల్కహాల్ శిశువు శరీరంలో పేరుకుపోతుంది. దీంతో శిశువుకు పోషకాలు, ఆక్సిజన్ అందక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.

News January 29, 2026

నోటీసులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు: KTR

image

TG: KCRకు <<18992001>>నోటీసులు<<>> ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం అని కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నోటీసులు ఇచ్చింది. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు’ అని ట్వీట్ చేశారు.