News April 1, 2024
సీఎం జగన్ పెన్షనర్లను రెచ్చగొడుతున్నారు: బొండా

AP: సీఎం జగన్ పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని TDP నేత బొండా ఉమ మండిపడ్డారు. వాలంటీర్లను పెన్షన్లు ఇవ్వొద్దని EC ఇచ్చిన ఆదేశాలను అదునుగా చేసుకుని ప్రజల్ని రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్లు తప్ప ప్రభుత్వంలో అధికారులే లేరా? అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్లను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని పర్మినెంట్ చేస్తామని తెలిపారు.
Similar News
News April 18, 2026
లోక్సభ నిరవధిక వాయిదా

లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. మూడు రోజులపాటు సాగిన సమావేశాలు నేటితో ముగిశాయి. నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిన అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పలువురు ఎంపీలు ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
News April 18, 2026
చర్చకు సిద్ధమా? పవన్కు ప్రకాశ్రాజ్ సవాల్

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకున్నాయని AP D.CM <<19679100>>పవన్<<>> చేసిన ట్వీట్పై ప్రకాశ్రాజ్ స్పందించారు. ‘మోదీని మెప్పించేందుకు ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఆపండి. ఈ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని ఇప్పుడూ ఆమోదించవచ్చు. కానీ మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చూసింది. ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుంది. దీనిపై డిబేట్కు సిద్ధమా’ అని సవాల్ విసిరారు.
News April 18, 2026
B12 లోపంతో నరాలు దెబ్బతినే ప్రమాదం: వైద్యులు

రక్తహీనత లేకపోయినా 40% మందిలో విటమిన్ B12 లోపం వల్ల నరాల వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెట్ఫార్మిన్ మందు వాడే 15–30% మధుమేహ బాధితుల్లో ఈ లోపం కనిపిస్తోందని చెబుతున్నారు. ‘B12 స్థాయి 200 pg/mL కంటే తగ్గితే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పు ఉంది. కాబట్టి సకాలంలో B12, MMA, హోమోసిస్టీన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యమైతే నష్టం పూడ్చలేం’ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


