News March 16, 2024

ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాది వద్ద నివాళులు అర్పించేందుకు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో సీనియర్ నాయకులు అభ్యర్థులను ప్రకటించనున్నారు.

Similar News

News November 7, 2025

వందేమాతరం గొప్ప గేయం: కడప SP

image

వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే గొప్ప గేయం వందేమాతరం అని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

News November 7, 2025

నేడు కడపలో భారీ ర్యాలీ

image

WWC భారత్ గెలిచిన తర్వాత తొలిసారి కడపకు నల్లపురెడ్డి శ్రీచరణి నేడు రానున్నారు. కడప క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు ఇర్కాన్ సర్కిల్ వద్ద సాయంత్రం స్వాగతం పలుకుతారు. తర్వాత హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఏడు రోడ్ల మీదుగా రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వరకు భారీ ర్యాలీ చేస్తారు. రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఆమెను సన్మానిస్తారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆమె సాయంత్రానికి కడపకు వస్తారు.

News November 7, 2025

కడప: వేలంలోకి శ్రీచరణి

image

మన కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి వుమెన్స్ వరల్డ్‌కప్‌లో సత్తాచాటిన విషయం తెలిసిందే. కప్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించింది. అయినప్పటికీ WPLలో ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిటైన్ చేసుకోలేదు. దీంతో త్వరలో జరగనున్న WPL-2026 వేలంలోకి శ్రీచరణి రానుంది. గత సీజన్‌లో ఆమెకు ఢిల్లీ జట్టు రూ.55 లక్షలు చెల్లించగా.. వేలంలో రూ.కోట్లలో ధర దక్కే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.