News March 16, 2024
ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాది వద్ద నివాళులు అర్పించేందుకు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో సీనియర్ నాయకులు అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Similar News
News February 1, 2026
జమ్మలమడుగులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

జమ్మలమడుగు-ముద్దునూరు రహదారిలోని పాటి వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. JMD (M) పెద్ద దండ్లూరు వాసి మాబు హుస్సేన్ (36), ప్రొద్దుటూరు (M) చౌడూరు వాసి ఖాదర్ బాషా (32) బైక్పై ముద్దనూరు నుంచి JMDకు వస్తుండగా అడ్డు వచ్చిన ఆవును తప్పించబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న వరి కోత మెషీన్ వాహనాన్ని ఢీకొని చనిపోయారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 1, 2026
గండికోటకు రానున్న అపర కుబేరుడు

ఇవాళ కడప జిల్లాకు అపర కుబేరుడు గౌతమ్ అదానీ రానున్నారు. ఇవాళ గండికోటలో, కొండాపురం, లింగాల మండలాల్లో అదానీ గ్రూప్ కంపెనీ చేపడుతున్న ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. ఈయన దాదాపు రూ.పది వేల కోట్లతో జిల్లాలో విద్యుత్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. దీంతో వాటి పరిశీలనతో పాటు అదానీ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి, కలెక్టర్తో చర్చిస్తారు.
News February 1, 2026
చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ చెన్నూరు పోలీస్ స్టేషన్ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, లాక్అప్లను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సీఐ కృష్ణారెడ్డిని ఆదేశించారు. ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూ, పారదర్శక సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.


