News April 25, 2024

నేటితో సీఎం జగన్ బస్సు యాత్ర ముగింపు

image

AP: సీఎం జగన్ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నేడు ముగియనుంది. టెక్కలిలోని అక్కవరం ప్రాంతంలో ‘మేమంతా సిద్ధం’ ముగింపు సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. కాగా గత నెల 27న కడప జిల్లా ప్రొద్దుటూరులో యాత్ర మొదలైంది. ఇటు పులివెందులలో ఈ నెల 25న జగన్ నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత నుంచి రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 1, 2025

గంభీర్‌.. రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలు?

image

టీమ్ఇండియా కోచ్ గంభీర్, స్టార్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలున్నట్లుగా తెలుస్తోంది. ‘గంభీర్-రోహిత్, కోహ్లీ మధ్య బంధాలు అంత బాగా లేవు. ఇద్దరు ప్లేయర్ల భవిష్యత్తుపై విశాఖ లేదా రాయ్‌పూర్‌లో మీటింగ్ జరిగే ఛాన్స్ ఉంది’ అని జాతీయ మీడియా తెలిపింది. టెస్టులకు వీరు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచే వివాదాలు మొదలైనట్లు పేర్కొంది. రోహిత్, సెలక్టర్ అగార్కర్ మధ్య కూడా సంబంధాలు సరిగా లేవని చెప్పింది.

News December 1, 2025

భారీ జీతంతో ECGC లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECGC)లో 30 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, MA(హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. DEC 15నుంచి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు. JAN 11న రాత పరీక్ష, FEB/MARలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు జీతం రూ.88,635 -రూ.1,69,025 చెల్లిస్తారు.

News December 1, 2025

భక్తికి, నిరీక్షణకు ప్రతీక ‘శబరిపీఠం’

image

నిర్గుణోపాసన, నిరంతర నిరీక్షణకు ప్రతీక ‘శబరిపీఠం’. ఈ పవిత్ర స్థలంలోనే శబరి మాత కఠోర భక్తితో అయ్యప్ప స్వామి దర్శనం పొందింది. ఈ పీఠానికి దాదాపు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. పూర్వకాలంలో, పందళ రాజవంశీయులు ఇక్కడ ఓ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసి విద్యనభ్యసించారని ప్రతీతి. భక్తికి, నిరీక్షణకు గొప్ప ఉదాహరణగా నిలిచే ఈ ప్రదేశం అయ్యప్ప స్వాములకు పరమాత్మ దర్శనానికి మార్గాన్ని చూపిస్తుంది. <<-se>>#AyyappaMala<<>>