News March 17, 2024
కోనసీమ గడ్డ నుంచి సీఎం జగన్ ప్రచారం.. 19న సభ

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారిగా కోనసీమ గడ్డ నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 19వ తేదీన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో నిర్వహించనున్న వైసీపీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. స్థానిక ఆకుల వీర్రాజు విగ్రహం వద్ద మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సభ జరగనుందని కొత్తపేట MLA, వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు.
Similar News
News January 24, 2026
గోదావరి పుష్కరాలకు ఇంకా 515 రోజులే: ఇన్ఛార్జి కలెక్టర్

2027 గోదావరి పుష్కరాలకు ఇంకా 515 రోజులే ఉన్నందున, చేపట్టాల్సిన పనులపై ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్ మేఘా స్వరూప్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం అమరావతి నుంచి సమీక్ష నిర్వహించారన్నారు. వీటిపై ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
News January 23, 2026
తూ.గో: ఉద్యోగాలకు 57 మంది ఎంపిక

కర్ణాటక రాష్ట్రం హోసూరు ప్రాంతంలోని టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మొబైల్ ఆపరేటర్ పోస్టులకు తూ.గో జిల్లాకు చెందిన 57మంది ఎంపికయ్యారని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తెలిపారు. కలెక్టరేట్ వద్ద జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఈ అవకాశాలను అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 23, 2026
తూ.గో జిల్లా అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

తూర్పుగోదావరి జిల్లాల్లోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది సీట్ల భర్తీకి దరఖాస్తులను తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19లోపు https://apbragcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి.


