News April 6, 2024
కావలిలో నేడు సీఎం జగన్ బహిరంగ సభ

AP: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 9గంటలకు చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. కొవ్వూరు క్రాస్, గౌరవరం మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్రోడ్, ఓగూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.
Similar News
News October 15, 2025
ఫార్మసీ ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

AP: రాజమహేంద్రవరం పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 12 ఫార్మసీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డీ ఫార్మసీ/బీ ఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు రీజినల్ మెడికల్& హెల్త్ కమిషనర్ ఆఫీస్లో సా. 5గం.లోపు దరఖాస్తు సమర్పించాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://westgodavari.ap.gov.in/
News October 15, 2025
టికెట్ లేని ప్రయాణం.. రూ.కోటి ఫైన్ వసూలు

టికెట్ లేకుండా ప్రయాణించిన వారిపై సౌత్ సెంట్రల్ రైల్వే కొరడా ఝుళిపించింది. జోన్ పరిధిలో సోమవారం చేసిన ప్రత్యేక తనిఖీల్లో 16వేల మంది దొరికారు. రోజూ ఫైన్లతో సగటున ₹47 లక్షలు వస్తే 13న SCR చరిత్రలో తొలిసారి ఒకేరోజు ₹1.08కోట్లు వసూలైంది. VJA డివిజన్: ₹36.91L, గుంతకల్లు: ₹28L, Sec-bad: ₹27.9L, GNT: ₹6.46L, HYD: ₹4.6L, నాందేడ్: ₹4.08L. టికెట్ లేని ప్రయాణాలకు ఫైన్, జైలు శిక్ష ఉంటాయని SCR హెచ్చరించింది.
News October 15, 2025
రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం

TG: CM రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం రేపు మ.3 గం.కు సమావేశం కానుంది. ప్రధానంగా BC రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, మెట్రో రైలు ప్రాజెక్ట్, ధాన్యం సేకరణ, మూసీ ప్రాజెక్ట్, టీ-ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ అంశాలు చర్చకు రానున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనుల అంశం, సమ్మక్క-సారలమ్మ ఆనకట్ట, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం వంటి అంశాలూ చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.