News April 6, 2024

కావలిలో నేడు సీఎం జగన్ బహిరంగ సభ

image

AP: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 9గంటలకు చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. కొవ్వూరు క్రాస్, గౌరవరం మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్‌రోడ్, ఓగూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.

Similar News

News November 21, 2025

24 నుంచి కొత్త కార్యక్రమం

image

AP: సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వారంపాటు జరిగే ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదాతల ఇళ్లకు వెళ్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై అవగాహన కల్పిస్తారు. అలాగే DEC 3న RSKల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహిస్తారు.

News November 21, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>మెదక్<<>> ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 21 జూనియర్, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు NAC/NTC కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు 18- 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.21,000-రూ.23,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్:https://ddpdoo.gov.in/

News November 21, 2025

రంగేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

image

గతంలో తెల్ల జుట్టు వస్తేనే రంగేసుకొనేవారు. కానీ ఇప్పుడు ఫ్యాషన్, ట్రెండ్ అంటూ రకరకాల రంగులతో జుట్టు స్వరూపాన్ని మార్చేస్తున్నారు. దీనికి ముందు కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. చర్మ రంగుని బట్టి జుట్టు రంగును ఎంచుకోవాలి. రంగు మాత్రమె కాదు షేడ్ కూడా చూసుకోవాలి. లేదంటే జుట్టు, మీ అందం చెడిపోతాయి. మొదటిసారి రంగేస్తున్నట్లయితే వీలైనంత వరకు నిపుణులను సంప్రదించడం మంచిది.