News July 29, 2024
ప్రమోటెడ్ టీచర్లతో ఆగస్టు 2న సీఎం సమావేశం

TG: ఇటీవల ప్రమోషన్లు పొందిన దాదాపు 30వేల మంది టీచర్లతో సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 2న సమావేశం కానున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 3గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు నేరుగా సీఎంతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News January 21, 2026
సింగరేణి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది: కిషన్రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే సింగరేణి నిర్వహణ బాధ్యత కేంద్రం తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. మంత్రుల మధ్య వాటాల గొడవతోనే సింగరేణి వివాదం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్కు లేఖ రాస్తానని పేర్కొన్నారు.
News January 21, 2026
వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.
News January 21, 2026
సమయం అనుకూలించనప్పుడు చేయాల్సిన పనులు

కాలం కలిసి రానప్పుడు పాటించే కొన్ని ఆధ్యాత్మిక నియమాలు మనలో మార్పులు తెస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బయటకు వెళ్లేటప్పుడు నుదుట కుంకుమ, విభూతి ధరిస్తే దృష్టి దోషాలు తొలగి శుభం కలుగుతుంది. శుక్రవారం లక్ష్మీ గణపతిని ఎర్రని పూలతో పూజిస్తే అభివృద్ధి లభిస్తుంది. నిద్రించే ముందు గురు చరిత్ర పారాయణం చేయడం, ఉదయాన్నే అరచేతిని దర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.


