News September 2, 2025
మారిటైమ్ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ

AP: విశాఖపట్నంలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మారీటైమ్ రంగంలోని బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్, ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీ లేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. పలు కంపెనీల సీీఈవోలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
Similar News
News January 27, 2026
ఇంటర్వ్యూతో ICMRలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(<
News January 27, 2026
ధాన్యం నిల్వలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ధాన్యాన్ని పరిశుభ్రమైన, పొడి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. సంచులు గోడల నుంచి నేల నుంచి తేమ పీల్చుకోకుండా జాగ్రత్త పడాలి. ధాన్యాన్ని 1-2 అడుగుల ఎత్తు గల దిమ్మల మీద గాని బెంచీల మీద గాని పెడితే నేలలో తేమను సంచులు పీల్చుకోవు. కీటకాల నుంచి ధాన్యం రక్షణకు నిపుణుల సూచన మేరకు అప్పుడప్పుడు పొగబెట్టడం మంచిది. ఎలుకలను కట్టడి చేయకుంటే అవి ధాన్యాన్ని తినేస్తూ వాటి విసర్జనలు, వెంట్రుకలతో కలుషితం చేస్తాయి.
News January 27, 2026
మాట తప్పడం, మడమ తిప్పడం TDP రక్తంలోనే లేదు: లోకేశ్

AP: పేదరికం లేని సమాజం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. మాట తప్పడం, మడమ తిప్పడం టీడీపీ రక్తంలోనే లేదని చెప్పారు. ‘పార్టీనే అందరికీ అధినాయకత్వం. చంద్రబాబు సేనాధిపతి. మనమంతా ఆయన సైనికులం. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా చంద్రబాబు నడిపిస్తున్నారు’ అని తెలిపారు.


