News October 15, 2024

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో 18న సీఎం భేటీ

image

AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఈ నెల 18న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. మార్చిలో జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. మద్యం, ఇసుక వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల జోక్యంపై విమర్శలు వస్తుండటంపై వివరణ తీసుకుంటారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల కేటాయింపుపైనా చర్చిస్తారని, ప్రభుత్వ పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని సమాచారం.

Similar News

News December 19, 2025

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్‌తో హోటళ్లకు గిరాకీ

image

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్‌తో హోటళ్ల బిజినెస్ కళకళలాడుతోంది. వీటివల్ల కొత్త కస్టమర్లను చేరుకోగలుగుతున్నామని 59% ఓనర్లు పేర్కొన్నట్లు NCAER FY23-24 నివేదిక వెల్లడించింది. ‘హోటళ్లకు మొత్తంగా 50.4% కస్టమర్లు పెరిగారు. 52.7% కొత్త మెనూ ఐటమ్స్ యాడ్ అయ్యాయి. ప్లాట్‌ఫార్మ్స్‌ ద్వారా హోటళ్లకు వచ్చే షేర్ 29%కి చేరింది. ఎంప్లాయిమెంటు 1.08 మిలియన్ల నుంచి 1.37 మిలియన్లకు పెరిగింది’ అని వివరించింది.

News December 19, 2025

PMUYతో ప్రతి గ్యాస్ కనెక్షన్‌పై ₹300 రాయితీ: CBN

image

AP: రాష్ట్రంలోని 65.40 లక్షల LPG కనెక్షన్లను ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పరిధిలోకి తీసుకురావాలని CM CBN కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కోరారు. దానివల్ల సిలిండర్‌పై లబ్ధిదారుకు ₹300 రాయితీ లభిస్తుందని చెప్పారు. గ్యాస్ పైప్ లైన్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కులను పెంచాలన్నారు. నెల్లూరు జిల్లాలో ₹96,862 CRతో ఏర్పాటయ్యే BPCL గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు.

News December 19, 2025

భారత్‌ను రెచ్చగొట్టే ప్లాన్‌తోనే దాడి: బంగ్లాదేశ్ మాజీ మంత్రి

image

బంగ్లాదేశ్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్ ఇంటిపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారని హసీనా సర్కారులో విద్యా మంత్రిగా చేసిన మొహిబుల్ హసన్ చౌదరి ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయాలనే ఉద్దేశంతో మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యూనస్ దేశంలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. కింది స్థాయి పొలిటికల్ వర్కర్లను తొక్కేయాలని చూస్తున్నారన్నారు. భారత్‌ను రెచ్చగొట్టాలనే ఉద్దేశం కూడా దాడుల వెనుక ఉందని ఆరోపించారు.