News October 15, 2024
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో 18న సీఎం భేటీ
AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఈ నెల 18న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. మార్చిలో జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. మద్యం, ఇసుక వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల జోక్యంపై విమర్శలు వస్తుండటంపై వివరణ తీసుకుంటారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల కేటాయింపుపైనా చర్చిస్తారని, ప్రభుత్వ పనితీరుపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారని సమాచారం.
Similar News
News October 15, 2024
రజినీ సినిమాలో ఛాన్స్ నిరాకరించిన నాని?
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’లో నటించే అవకాశాన్ని హీరో నాని వదులుకున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీలో ఫహాద్ ఫాజిల్ నటించిన దొంగ పాత్రకు తొలుత నానినే మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. సినిమాలో ఆ పాత్రకు బరువు లేదని భావించి, నాని నిరాకరించారని టాక్. వేట్టయన్లో రానా, అమితాబ్ తదితరుల పాత్రలకూ సరైన ప్రాముఖ్యత లభించలేదు. దీంతో నాని నిర్ణయం కరెక్టేనంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
News October 15, 2024
DOPT ఉత్తర్వులు పాటించాల్సిందే.. క్యాట్ తీర్పు
తమను APకి వెళ్లాలంటూ DOPT జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణలో పనిచేస్తున్న IASలు వేసిన పిటిషన్పై CAT కీలక తీర్పునిచ్చింది. వారు ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఐఏఎస్ల విజ్ఞప్తిని తిరస్కరించింది. రేపు యథావిధిగా ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో వాకాటి అరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది.
News October 15, 2024
స్నేహితుడి హత్య.. సల్మాన్కు భద్రత పెంపు
రాజకీయ నేత బాబా సిద్ధిఖీ <<14343654>>హత్య నేపథ్యంలో<<>> బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ భద్రతను Y+ కేటగిరీకి ప్రభుత్వం పెంచింది. ఆయన భద్రతపై ఆందోళనలు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన బయటకు వెళ్లిన సమయంలో పోలీస్ ఎస్కార్ట్ వెంట ఉండనుంది. బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ కూడా Y+ సెక్యూరిటీ కలిగి ఉన్నారు. ఈ కేటగిరీలో ఇద్దరు PSOలతో పాటు 11 మంది సిబ్బందిని భద్రతగా కేటాయిస్తారు.