News January 9, 2025

సీఎం ఆదేశాలు.. తిరుపతికి బయల్దేరిన ముగ్గురు మంత్రులు

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో అధికార వైఫల్యాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాలతో హోం, దేవాదాయ, రెవెన్యూ శాఖ మంత్రులు తిరుపతికి బయల్దేరారు. అక్కడి పరిస్థితులను వారు దగ్గరుండి సమీక్షించనున్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అటు రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు.

Similar News

News August 19, 2025

సుదర్శన్ రెడ్డి ఎంపికకు కారణమిదేనా?

image

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా <<17451888>>బి.సుదర్శన్‌రెడ్డి<<>> ఎంపిక వ్యూహాత్మక నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయేతర వ్యక్తిని బరిలో దింపడంతో NDAతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలను ఇరకాటంలో పెట్టినట్లైందంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని TDP, YSRCP, BRS పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకే తెలుగు వ్యక్తిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. సుదర్శన్‌రెడ్డి CM చంద్రబాబుకు సన్నిహితుడు కావడం గమనార్హం.

News August 19, 2025

కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్

image

TG: హైదరాబాద్‌లో విద్యుత్ స్తంభాలపై పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో TGSPDCL సిబ్బంది యుద్ధప్రాతిపదికన వాటిని కట్ చేస్తున్నారు. <<13977633>>ఏడాది సమయం<<>> ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని హెచ్చరించారు.

News August 19, 2025

క్రేజీ.. కమల్ హాసన్-రజినీ కాంబోలో మూవీ!

image

తమిళ బిగ్ స్టార్లు రజినీ కాంత్, కమల్ హాసన్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తారని తెలుస్తోంది. క్రేజీ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తర్వాతి ప్రాజెక్ట్ ఇదేనని సినీ వర్గాలు తెలిపాయి. ఇదే నిజమైతే థియేటర్లు దద్దరిల్లుతాయని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే కమల్, రజినీతో విక్రమ్, కూలీ సినిమాలను లోకేశ్ తెరకెక్కించారు. ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు ‘ఖైదీ-2’ ఆలస్యం కానుందని సమాచారం.