News August 27, 2024
బలవంతపు మత మార్పిడులు జరగకుండా చూడాలని CM ఆదేశం

AP: దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. బలవంతపు మత మార్పిడులు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఆలయాల్లో అపచారాలకు చోటు ఉండకూడదని, ఆధ్యాత్మికత వెల్లివిరియాలని సూచించారు. ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధి కోసం దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖ మంత్రులతో కమిటీ వేస్తామన్నారు. సింహాచలం పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News December 4, 2025
ఉగ్ర సంస్థలోకి 5 వేల మంది మహిళలు!

ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ <<17958042>>మహిళా వింగ్<<>>లో 5 వేల మంది మహిళలు చేరినట్లు తెలుస్తోంది. వారిని తీవ్రవాదంవైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ‘కొన్ని వారాల్లోనే 5 వేల మంది మహిళలు చేరారు. త్వరలో జిల్లా యూనిట్లు ఏర్పాటు చేస్తాం’ అని జైషే చీఫ్ మసూద్ అజర్ SMలో పోస్ట్ చేశారు. పాక్లోని బహావల్పుర్, ముల్తాన్, కరాచీ, ముజఫరాబాద్ తదితర ఏరియాల మహిళలను రిక్రూట్ చేసినట్లు సమాచారం.
News December 4, 2025
చంద్రబాబును బొక్కలో పెట్టాలి: జగన్

AP: చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేశారని జగన్ విమర్శించారు. ‘చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వేయాలి. ఎవరైనా ఇలాంటి మోసం చేస్తే ఏం చేసేవారు? జైల్లో పెడతారు కదా’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తల్లికి వందనం, ఉచిత సిలిండర్లు అంటూ మోసం చేశారని.. ఉచిత బస్సుకు ఎన్నో నిబంధనలు పెట్టారని ఫైరయ్యారు. నాడు-నేడును పూర్తిగా ఆపేసి, ఇంగ్లిష్ మీడియాన్ని తీసేశారని విమర్శించారు.
News December 4, 2025
ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<


