News September 20, 2025
‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

AP: పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్త ఊడ్చారు. వారితో కాసేపు మాట్లాడారు. స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.2కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని మార్గదర్శి-బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశం కానున్నారు.
Similar News
News September 20, 2025
ఉగ్ర కలకలం.. రాంచీలో ISIS రిక్రూట్మెంట్ శిబిరం

ఝార్ఖండ్లోని రాంచీలో ISIS ఉగ్రవాద రిక్రూట్మెంట్ శిబిరం బట్టబయలైంది. కొన్నిరోజుల కిందట ఈ నగరంలో అనుమానిత ఉగ్రవాది అష్రఫ్ డానిష్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి విచారణలో ఉగ్ర శిబిరం గురించి తెలియడంతో రైడ్ చేశారు. అక్కడ పెద్దఎత్తున బాంబు తయారీ పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
News September 20, 2025
ఐఫోన్-17 నాణ్యతపై విమర్శలు!

యాపిల్ నుంచి ఐఫోన్-17 సిరీస్ అమ్మకాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. అయితే, గత సిరీస్లతో పోల్చితే 17 మోడల్స్లో నాణ్యత లేని అల్యూమినియం ఫ్రేమ్ వాడారని విమర్శలొస్తున్నాయి. దీనివల్ల ఫోన్పై గీతలు పడటం, దెబ్బ తినడం లాంటివి జరుగుతున్నాయని టెక్ నిపుణులు ఆరోపిస్తున్నారు. అయితే ఐఫోన్ -17 ఫ్రేమ్కు అత్యంత దృఢంగా ఉండే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం వాడుతున్నామని యాపిల్ సంస్థ చెబుతోంది.
News September 20, 2025
ఎయిర్పోర్టులపై సైబర్ అటాక్.. విమాన సర్వీసులపై ఎఫెక్ట్

యూరప్లోని పలు ఎయిర్పోర్టులపై సైబర్ అటాక్ జరిగింది. లండన్, బ్రస్సెల్స్, బెర్లిన్ విమానాశ్రయాల్లోని చెకింగ్ వ్యవస్థలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు ప్రయాణించే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. <<17769573>>రేపటిలోగా<<>> US వెళ్లాల్సిన H1B వీసాదారుల్లో ఈ సైబర్ అటాక్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటు మనదేశానికి రావాల్సిన విమాన సర్వీసులు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది.