News June 4, 2024
అనకాపల్లిలో సీఎం రమేశ్ ముందంజ
AP: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బూడి ముత్యాలనాయుడు పోటీలో ఉన్నారు. 1వ రౌండ్లో సీఎం రమేశ్కు 4,278 ఓట్లు పోలవ్వగా.. బూడి ముత్యాలనాయుడుకి 3,289 ఓట్లు పడ్డాయి. సీఎం రమేశ్ 989 మెజార్టీలో ఉన్నారు.
Similar News
News October 9, 2024
నేడు విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
నేడు విజయవాడ దుర్గమ్మకు AP సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో దుర్గమ్మను వీక్షించేందుకు ఇంద్రకీలాద్రికి 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో నీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తామని మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు.
News October 9, 2024
నిలవాలంటే గెలవాల్సిందే..
మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ఇవాళ శ్రీలంకతో తలపడనుంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. విజయం సాధిస్తే సెమీస్ ఆశలు పదిలం కానున్నాయి. నిన్న ఆస్ట్రేలియాపై భారీ తేడాతో న్యూజిలాండ్ ఓటమి భారత్కు కాస్త ప్లస్గా మారింది. కాగా మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది.
News October 9, 2024
విదేశీ విద్య: ఏ ఇన్టేక్ మంచిది..?
విదేశీ విద్యకు వెళ్లాలంటే ఫాల్, సమ్మర్ అనే రెండు సీజన్లుంటాయి. ఫాల్ ఇన్టేక్ ఏటా ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరులో స్టార్ట్ అవుతుంది. వర్సిటీలు విస్తృత కోర్సులు ఆఫర్ చేస్తాయి. ఎక్కువశాతం మంది ఎంచుకునే ఆప్షన్ ఇది. పార్ట్ టైమ్ అవకాశాలు బాగుంటాయి. ఇక సమ్మర్ ఇన్టేక్ అంటే ఏటా మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. చదువు త్వరగా పూర్తి చేయాలనుకునేవారు ఈ ఇన్టేక్ గురించి ఆలోచించొచ్చని నిపుణులు చెబుతున్నారు.