News June 4, 2024

అనకాపల్లిలో సీఎం రమేశ్ ముందంజ

image

AP: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బూడి ముత్యాలనాయుడు పోటీలో ఉన్నారు. 1వ రౌండ్‌లో సీఎం రమేశ్‌కు 4,278 ఓట్లు పోలవ్వగా.. బూడి ముత్యాలనాయుడుకి 3,289 ఓట్లు పడ్డాయి. సీఎం రమేశ్ 989 మెజార్టీలో ఉన్నారు.

Similar News

News October 27, 2025

బాదం నూనెతో ఎన్నో లాభాలు

image

బాదం నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు, చర్మ సంరక్షణకు తోడ్పడతాయంటున్నారు నిపుణులు. బాదం, ఆముదం, ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకొని మాడుకు మసాజ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఒత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే తరచూ బాదం నూనెతో మసాజ్ చేస్తే డార్క్​ సర్కిల్స్, ముఖంపై ముడతలు, గీతలు, మచ్చలు తగ్గి తేమ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. <<-se>>#skincare<<>>

News October 27, 2025

వద్దన్నా.. బర్లీ పొగాకు సాగు చేస్తున్నారు

image

AP: సరైన ధర, కొనుగోలు లేనందున బర్లీ పొగాకు సాగుపై ప్రభుత్వం ఆంక్షలు విధించినా రైతులు వెనక్కు తగ్గడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 21వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. ప్రకాశం జిల్లాలో 11,400 ఎకరాల్లో, కర్నూలులో 4 వేలు, పల్నాడు జిల్లాలో 4,600 ఎకరాల్లో.. మరో 7 జిల్లాల్లో కొద్ది విస్తీర్ణంలో బర్లీ పొగాకును సాగు చేస్తున్నట్లు వెల్లడైంది. రైతులు ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారో అధికారులకు కూడా తెలియదు.

News October 27, 2025

కరూర్ తొక్కిసలాట బాధితులతో విజయ్ భేటీ

image

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల తర్వాత బాధిత కుటుంబాలను నటుడు, TVK చీఫ్ విజయ్ కలిశారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో 50 రూమ్స్ బుక్ చేసి పార్టీ నేతలు బస్సుల్లో వారిని అక్కడికి తీసుకెళ్లారు. బాధితులతో విజయ్ మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. అంతకుముందు మృతుల కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడం తెలిసిందే.