News January 26, 2025
ఢిల్లీలో ఏటికొప్పాక బొమ్మల శకటం.. స్పందించిన సీఎం

AP: ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రదర్శించడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ప్రధాని మోదీతో సహా ప్రముఖులందరినీ ఈ శకటం ఆకట్టుకుంది. పర్యావరణహితమైన, సహజసిద్ధమైన వనరులతో చేసే మన ఏటికొప్పాక బొమ్మలు కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. శకటంలో భాగస్వాములను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.
Similar News
News November 20, 2025
HYD: కుర్రకారు.. డేటింగ్ యాప్స్తో జాగ్రత్త..!

డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం పెంచుకొని, నమ్మకం కలిగిన తర్వాత మత్తు పదార్థాల రుచి చూపించి, ఒక్కసారి సరదా పేరుతో యువతను గంజాయి సహా వివిధ రకాల డ్రగ్స్ వలయంలోకి లాగుతున్నట్లు HYDలో పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News November 20, 2025
దక్షిణాఫ్రికాతో వన్డేలకు బుమ్రా, హార్దిక్ దూరం!

దక్షిణాఫ్రికాతో NOV 30 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్కు స్టార్ ప్లేయర్లు బుమ్రా, హార్దిక్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే T20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని వీరికి విశ్రాంతి ఇచ్చే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. కాగా ఆసియాకప్లో గాయపడిన హార్దిక్ కోలుకుంటున్నారు. WC వరకు హార్దిక్ టీ20లపై ఫోకస్ చేస్తారని BCCI వర్గాలు పేర్కొన్నాయి. 2026 FEBలో T20 WC మొదలయ్యే ఛాన్స్ ఉంది.
News November 20, 2025
రైతులకు అండగా ఉండటం మా బాధ్యత: లోకేశ్

AP: సాగు తీరు మారాలి.. అన్నదాత బతుకు బాగుపడాలన్నదే తమ సంకల్పమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. “ఇవాళ 46.85 లక్షల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ-PM కిసాన్’ కింద 2విడతల్లో కలిపి రూ.14 వేలు చొప్పున జమ చేశాం. అలాగే CM చంద్రబాబు వ్యవసాయాభివృద్ధికి పంచసూత్రాలు ప్రకటించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సాయం వంటి మార్గదర్శకాలు సూచించారు” అని ట్వీట్ చేశారు.


