News December 13, 2024
రైల్వే ప్రాజెక్టులపై కేంద్రానికి CM రేవంత్ విజ్ఞప్తులు

TG: కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను CM రేవంత్ కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, రైల్వే ప్రాజెక్టులపై ఢిల్లీలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. VKB-కృష్ణా, కల్వకుర్తి-మాచర్ల మధ్య నూతన రైలు మార్గం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. డోర్నకల్-మిర్యాలగూడ, డోర్నకల్-గద్వాల రైలు మార్గాలను పునఃపరిశీలించాలని కోరారు.
Similar News
News December 8, 2025
రేపు సాయంత్రం నుంచి వైన్స్ బంద్

TG: ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా తొలి విడత ఎన్నికలు ఈ నెల 11న 4,236 స్థానాల్లో జరగనున్నాయి.
News December 8, 2025
IIIT-నాగపుర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

IIIT-నాగపుర్ 6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ , పీహెచ్డీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం పీహెచ్డీ ఉన్నవారికి రూ.65వేలు, మిగతావారికి రూ.60వేలు చెల్లిస్తారు. దరఖాస్తు చేసిన తర్వాత కాపీని recruitment@iiitn.ac.in ఈమెయిల్కు పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.iiitn.ac.in.
News December 8, 2025
జనవరిలో దావోస్ పర్యటనకు చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు అక్కడ ఆయన పర్యటించనున్నారు. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. ఆయన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం తన పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసే అవకాశం ఉంది.


