News December 3, 2024

వన్యప్రాణుల బోర్డు ఛైర్మన్‌గా సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో వన్యప్రాణుల బోర్డుకు ప్రభుత్వం కొత్త సభ్యులను నియమించింది. ఈ బోర్డుకు సీఎం రేవంత్ ఛైర్మన్‌గా, అటవీశాఖ మంత్రి వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. అలాగే ఈ బోర్డులో మొత్తం 29 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, అధికారులు, పర్యావరణవేత్తలను బోర్డు నియమించింది. ఈ బోర్డులో ఎమ్మెల్యేలు భూక్యా మురళీ నాయక్, వంశీ కృష్ణ, పాయం వెంకటేశ్వర్లు, వెడ్మ బొజ్జు ఉన్నారు.

Similar News

News November 20, 2025

ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

image

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్‌నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.

News November 20, 2025

త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

image

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్‌కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్‌లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.

News November 20, 2025

TMC-HBCHలో ఉద్యోగాలు

image

విశాఖపట్నంలోని <>TMC<<>>-హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్& రీసెర్చ్ సెంటర్ 2 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి DMLT/ డిగ్రీ(MLT)/ బీఎస్సీ(హిమటాలజీ)/ ఎంఎస్సీ (ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు ఈనెల 24న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://tmc.gov.in/