News January 31, 2025
KCRకు సీఎం రేవంత్ సవాల్

TG: ఫామ్హౌస్లో ఉండి KCR కథలు చెబుతున్నారని CM రేవంత్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మొగిలిగిద్ద సభలో సీఎం మాట్లాడారు. ‘KCR అసెంబ్లీకి వస్తే రుణమాఫీపై లెక్కలు చెబుతా. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. గుమ్మికింద పందికొక్కుల్లా మిగులుబడ్జెట్ను BRS నేతలు తినేశారు. అబద్ధాలు చెప్పడం వల్లే ఓడిపోయారు. KCR కాలం చెల్లిన రూ.వెయ్యి నోటు లాంటివారు. దానికి, ఆయనకు విలువలేదు’ అంటూ విమర్శించారు.
Similar News
News November 24, 2025
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్పై సీఎం సమీక్ష

APలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’పై CM చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రియల్టైమ్ గవర్నెన్స్ డేటా ద్వారా సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఈ సిస్టమ్ పనిచేయనుంది. దీనివల్ల అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలు ఉంటుంది. కాగా కాసేపట్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘంతో CM సమావేశం కానున్నారు.
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 24, 2025
IIT ధన్బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<


