News March 16, 2025
సీఎం రేవంత్ క్లాస్.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు అటెండెన్స్?

TG: నిన్న అసెంబ్లీలో CM రేవంత్ ప్రసంగం సమయంలో లంచ్ టైమ్ దాటిపోతున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా కదల్లేదు. రోజుకు 3సార్లు MLAల హాజరు తీసుకోవాలని ఆయన చేసిన ఆదేశాలే దీనికి కారణమని తెలుస్తోంది. 3రోజుల క్రితం CLP మీటింగ్లో CM మాట్లాడుతున్న సమయంలో ఓ MLA నిర్లక్ష్యంగా బయటికి వెళ్లడం, సభలో BRS నేతలకు తమ సభ్యులు సరైన కౌంటర్ ఇవ్వడం లేదనే రేవంత్ హాజరు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 16, 2025
మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు కన్నుమూత

రాజవంశీకుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు అర్వింద్ సింగ్ మేవార్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ రాజస్థాన్లోని సిటీ ప్యాలెస్లో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రంజీల్లో రాజస్థాన్ కెప్టెన్గా వ్యవహరించారు. పూర్వీకుల ఆస్తులపై న్యాయపోరాటం చేస్తూ మేవార్ ఫ్యామిలీ ఇటీవల వార్తల్లో నిలిచింది. రేపు అర్వింద్ సింగ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.
News March 16, 2025
భోజనం చేసే విధానం ఇదే: సద్గురు

రోజువారీ ఆహారపు అలవాట్లపై ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ కొన్ని సూచనలు చేశారు. నేలపై కూర్చుని పద్మాసనం వేసుకుని తినాలి. చేత్తో తింటేనే మనం ఏం తింటున్నామో తెలుస్తుంది. తినేటప్పుడు 24 సార్లు నమలాలి. తినే ముందు కనీసం 2 నిమిషాలు ఆగితే ఇష్టంగా తింటాం. 35 ఏళ్లు దాటినవారు ఎంతకావాలో అంతే తీసుకోవాలి. వీరు రోజుకు రెండు సార్లు తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. తినేటప్పుడు మాట్లాడకూడదు.
News March 16, 2025
సమయానికి చేరుకునేలా ఉచిత బస్సులు: మంత్రి రాంప్రసాద్

AP: టెన్త్ విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకొని, జయప్రదంగా పరీక్షలు రాయాలన్నారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రేపటి నుంచి 6.15లక్షల మంది టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు.