News March 13, 2025

ఢిల్లీలో CM రేవంత్.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఫోకస్?

image

TG CM రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు విదేశాల్లో తలదాచుకుంటుండగా, వారిని స్వదేశానికి రప్పించే విషయంపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గల్ఫ్ కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశముంది.

Similar News

News December 28, 2025

నేటి ముఖ్యాంశాలు

image

✫ AP: టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు: చంద్రబాబు
✫ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలిపెట్టం: అనిత
✫ మానవ హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం: వైసీపీ
✫ TG: మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి: రేవంత్
✫ ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి
✫ జనవరి 5 నుంచి MGRNEGA బచావో అభియాన్: కాంగ్రెస్
✫ యాషెస్: నాలుగో టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్

News December 28, 2025

కొత్తగా 784 మంది స్పెషాలిటీ వైద్యులు: సత్యకుమార్

image

AP: సెకండరీ/టీచింగ్ ఆస్పత్రులకు కొత్తగా 784 మంది PG వైద్యులు(సీనియర్ రెసిడెంట్స్) జనవరి 1 నుంచి రాబోతున్నారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఇటీవల PG పూర్తి చేసిన వారికి పోస్టింగులు ఇస్తున్నట్లు చెప్పారు. నోటిఫికేషన్ జారీ చేశామని, ఈ నెల 29 వరకు ఆప్షన్ల నమోదు కొనసాగుతుందని చెప్పారు. వీరు 6 నెలలు బోధనాసుపత్రుల్లో, మరో 6 నెలలు సెకండరీ ఆసుపత్రుల్లో తప్పకుండా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

News December 28, 2025

టీమ్ ఇండియాకు కొత్త కోచ్?

image

న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో టెస్టుల్లో IND ఘోరంగా ఓడిపోవడంతో కోచ్ గంభీర్‌పై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను టెస్ట్ కోచ్ పదవి నుంచి తప్పించాలని BCCI భావిస్తోందని వార్తలొస్తున్నాయి. ఆయన స్థానంలో సొగసరి బ్యాటర్, తెలుగు క్రికెటర్ VVS లక్ష్మణ్‌ను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయనను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం లక్ష్మణ్ BCCI సెంటర్ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పనిచేస్తున్నారు.