News December 20, 2024
అసెంబ్లీలో గందరగోళంపై సీఎం రేవంత్ ఆరా

TG: అసెంబ్లీలో గందరగోళం నెలకొనగా సీఎం రేవంత్ రెడ్డి సభలో పరిస్థితిపై ఆరా తీశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్పై వేశారని కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ తమకు చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేయగా, సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Similar News
News January 29, 2026
మేడారంలో నేడే కీలక ఘట్టం.. గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క

TG: మేడారం మహాజాతరలో ఇవాళ ప్రధాన ఘట్టానికి తెరలేవనుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరనుంది. పూజారులు సాయంత్రం చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లిని తెచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఇక ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. నిన్న 40 లక్షల మంది గద్దెలను దర్శించుకున్నారు.
News January 29, 2026
CLRIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News January 29, 2026
మొక్కజొన్న కంకిలో గింజలు చివరి వరకూ రావాలంటే?

మొక్కజొన్న కంకిలో గింజలు నిండుగా రావాలంటే గింజలు పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకు అవసరమైన నీటిని అందించాలి. అలాగే చివరి దఫా ఎరువుగా నిపుణుల సూచనల మేరకు పొటాష్ అందిస్తే గింజ గట్టిపడి పొత్తు బరువు పెరుగుతుంది. అలాగే పంటకు సిఫార్సు మేరకు యూరియా, ఇతర పోషకాలను సరైన మోతాదులో అందించాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి.


