News January 26, 2025

పద్మ పురస్కారాలపై సీఎం రేవంత్ అసంతృప్తి

image

TG: పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే రావడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు. గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, చుక్కా రామయ్యవంటి పలువురు ప్రముఖుల పేర్లను తాము ప్రతిపాదించినా పరిగణించకపోవడం తెలంగాణ ప్రజలందర్నీ అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 139 పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి కనీసం 5 కూడా ఇవ్వకపోవడమేంటంటూ సీఎం ప్రశ్నించారు.

Similar News

News November 25, 2025

హనుమాన్ చాలీసా భావం – 20

image

దుర్గమ కాజ జగత కే జేతే | సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ||
ఎంత కష్టమైన పనులైనా హనుమంతుని అనుగ్రహం లభిస్తే అవి సులభంగా మారిపోతాయి. జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద సవాళ్లు, అడ్డంకులు మనకు అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ మన ఆత్మవిశ్వాసం, బలానికి ఆంజనేయుడిపై పెట్టుకున్న నమ్మకం తోడైతే.. ఎంతటి కష్టాలనైనా అధిగమించగలమని, పెద్ద ఇబ్బందులను దాటడం కష్టమేం కాదని ఈ హనుమాన్ చరణం వివరిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 25, 2025

తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి

image

AP: తేమ శాతం 17 దాటినా మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించినట్లు మంత్రి దుర్గేశ్ తెలిపారు. తూ.గో(D) చాగల్లు, దొమ్మేరులో మంత్రి మనోహర్‌తో కలిసి ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షం వల్ల పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా టార్పాలిన్లు అందిస్తున్నామని చెప్పారు.

News November 25, 2025

‘అరుణాచల్’ మహిళకు వేధింపులు.. భారత్ ఫైర్!

image

‘అరుణాచల్’ చైనాలో భాగమంటూ భారత మహిళను షాంఘై అధికారులు <<18373970>>ఇబ్బందులకు గురిచేయడంపై<<>> IND తీవ్రంగా స్పందించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల మధ్య నెలకొంటున్న సాధారణ పరిస్థితులకు ఈ అనవసరమైన చర్య అడ్డంకి అవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. ‘అరుణాచల్ INDలో భాగం. అక్కడి వారు IND వీసాతో ట్రావెల్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ రూల్స్‌ను చైనా ఉల్లంఘించింది’ అని మండిపడినట్లు సమాచారం.