News February 6, 2025
కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ భేటీ
TG: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఢిల్లీలో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఎంపీలు కూడా వేణును కలిశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ పనితీరు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం.
Similar News
News February 7, 2025
మంత్రులకు ర్యాంకులు.. వారికి అంబటి కంగ్రాట్స్
AP: ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన <<15380097>>ర్యాంకులపై<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘మంత్రివర్గపు ర్యాంకులలో 8, 9 స్థానాలను సాధించిన లోకేశ్, పవన్లకు అభినందనలు!’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు 10వ ర్యాంకు వచ్చిందని పలువురు కామెంట్స్ చేశారు. ప్రత్యేకంగా వీరిద్దరికే శుభాకాంక్షలు చెప్పడం వెనుక వ్యంగ్యం ఉందని పేర్కొంటున్నారు.
News February 7, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 7, 2025
అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి
AP: రాజధాని అమరావతిలో పలు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచేందుకు ఈసీ అనుమతిచ్చింది. ప్రస్తుతం కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. దీంతో అమరావతిలో పనులకు అనుమతి ఇవ్వాలని సీఆర్డీఏ ఈసీకి లేఖ రాయగా అభ్యంతరం లేదని బదులిచ్చింది. టెండర్లు పిలవొచ్చని, అయితే ఎన్నికలు పూర్తయ్యాకే ఖరారు చేయాలని పేర్కొంది.