News January 4, 2025
పోలవరం ప్రభావంపై అధ్యయనానికి సీఎం రేవంత్ ఆదేశం

TG: ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. 2022లో గోదావరికి వచ్చిన వరదలతో భద్రాచలం ఆలయం ముంపునకు గురైందని తాజా సమీక్షలో అధికారులు సీఎంకు వివరించారు.
Similar News
News January 10, 2026
కవిలి చెట్లు కాస్తే కారువరి పండుతుంది

కవిలి చెట్లు అనేవి అడవులలో లేదా పొలం గట్లపై పెరిగే ఒక రకమైన చెట్లు. పూర్వం రైతులు ప్రకృతిలో జరిగే మార్పులను గమనించి వర్షాలను, పంటలను అంచనా వేసేవారు. కారువరి అంటే వర్షాకాలంలో పండే వరి పంట. కవిలి చెట్లు ఆ ఏడాది ఎక్కువగా పూతపూసి, కాయలు కాస్తే, ఆ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని, వరి పంట (కారు వరి) సమృద్ధిగా పండుతుందని రైతుల నమ్మకం. ఇలాంటి నమ్మకాలే అప్పట్లో రైతులకు ఒక ‘వ్యవసాయ క్యాలెండర్’లా ఉపయోగపడేవి.
News January 10, 2026
పుష్య మాసం శనీశ్వరుడికి ఎందుకు ఇష్టం?

పుష్యమాసం శనీశ్వరుడికి ప్రీతికరం. అందుకు కారణం ఆయన జన్మనక్షత్రం. శని దేవుడు పుష్యమి నక్షత్రంలో జన్మించాడు. చంద్రుడు పుష్యమి నక్షత్రంతో ఉండే మాసమే పుష్యమి కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు ఆయన త్వరగా అనుగ్రహిస్తాడని నమ్మకం. శని దోషాలు ఉన్నవారు ఈ మాసంలో శని దేవుడికి తైలాభిషేకం, నువ్వుల దానం చేయడం వల్ల పీడలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అందుకే శని గ్రహ శాంతికి ఈ మాసం అత్యంత శ్రేష్ఠమైనది.
News January 10, 2026
వొడాఫోన్ ఐడియాకు కేంద్రం భారీ ఊరట

అప్పుల భారంతో కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఇటీవల AGR బకాయిల చెల్లింపుల్లో పాక్షిక <<18724413>>మారటోరియం<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2026 నుంచి 2032 వరకు ఆరేళ్లపాటు ఏటా రూ.124 కోట్లు, ఆ తర్వాత నాలుగు ఏళ్లపాటు ఏటా రూ.100 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. మొత్తం రూ.87,695 కోట్ల బకాయిల్లో వచ్చే పదేళ్లలో రూ.1,144 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.


