News February 28, 2025
మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. మార్చి 9న ఆయన ప్రధానితో సహా పలు పార్టీ నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలపాలని కోరనున్నట్లు సమాచారం. అంతకుముందు మార్చి 6న రాష్ట్ర కేబినెట్ భేటీ అయి ఈ బిల్లుకు ఆమోదం తెలపనుంది. మరోవైపు మార్చి 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.
Similar News
News December 28, 2025
పాలమూరులో ‘సైబర్’ కలకలం.. పెరుగుతున్న కేసులు

సాంకేతికత ముసుగులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉమ్మడి పాలమూరులోని MBNR, NRPT, GDWL, NGKL, WNP పరధిలో 2025 ఏడాదిలో 3625 ఫిర్యాదులు రాగా, 454 కేసులు ఫైల్ అయ్యాయి. గతేడాది 3,003 ఫిర్యాదులు రాగా 236 కేసులు నమోదయ్యాయి. మహబూబ్నగర్లో అత్యధికంగా 1475 ఫిర్యాదులు రాగా 220 కేసులు నమోదయ్యాయి. నారాయణపేటలో అత్యల్పంగా 318 ఫిర్యాదులు రాగా 59 కేసులు నమోదయ్యాయి.
News December 28, 2025
Silver.. సారీ..! Stock లేదు!

వెండి పరుగులతో పెట్టుబడి కోసం బిస్కెట్స్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ కొందామని షాపులకు వెళ్తున్న కస్టమర్లకు నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ షాపుల్లో సిల్వర్ బార్స్ లేవనే సమాధానం వస్తోంది. ఒకవేళ అక్కడక్కడా ఉన్నా 10గ్రా, 15g, 20g బార్స్ తప్ప వందలు, వేల గ్రాముల్లో లేవని చెబుతున్నారు. ఆర్డర్ పెడితే 4-7 రోజులకు వస్తుందని, ఆరోజు ధరకే ఇస్తామంటున్నారు. మీకూ ఇలా అయిందా? కామెంట్.
News December 28, 2025
EDలో 75పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(<


