News September 3, 2024

CM రేవంత్‌ 2 వారాల్లో వివరణ ఇవ్వాలి: సుప్రీం

image

TG: BRS MLC కవితకు బెయిల్ రావడంపై సోషల్ మీడియాలో T.కాంగ్రెస్ చేసిన పోస్టుపై వివరణ ఇవ్వాలని CM రేవంత్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యవహారంలో సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రెండు వారాల్లో రేవంత్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై ఆగస్టు 29న సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించగా రేవంత్ విచారం వ్యక్తం చేయడం తెలిసిందే.

Similar News

News December 29, 2025

2025లో తగ్గిన ఇళ్ల విక్రయాలు.. పెరిగిన విలువ!

image

2025లో ఇళ్ల అమ్మకాలు యూనిట్లపరంగా 14% తగ్గినా.. విలువ మాత్రం 6% పెరిగింది. సామాన్యులు కొనే బడ్జెట్ ఇళ్ల కంటే లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడమే దీనికి కారణం. మధ్యతరగతి జనం ఇళ్లు కొనడానికి కాస్త వెనకడుగు వేశారు. మరోవైపు ఆఫీస్ స్పేస్, కమర్షియల్ బిల్డింగుల లీజింగ్ మాత్రం అదరగొట్టింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గి, బడ్జెట్‌లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటే మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందని బిల్డర్లు ఆశిస్తున్నారు.

News December 29, 2025

ఉద్యోగుల అంశంపై హరీశ్‌రావుకు శ్రీధర్ బాబు కౌంటర్

image

TG: అసెంబ్లీలో ఉద్యోగుల అంశంపై BRS నేత హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ‘ఆరు DAలు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లయినా PRC లేదు. పోలీసులకు సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు. ఉద్యోగులను కాంగ్రెస్ మోసం చేస్తోంది’ అని హరీశ్ విమర్శించారు. అయితే ఉద్యోగుల గురించి BRS మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి శ్రీధర్ కౌంటర్ ఇచ్చారు. గత పాలకులు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

News December 29, 2025

జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం

image

AP: జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చింది. రాయచోటిని మదనపల్లె జిల్లాకు, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు, రాజంపేటను కడప జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరుకు మార్చేందుకు ఆమోదం తెలిపింది.