News January 27, 2025
నేడు ఇండోర్కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. ఇండోర్లో సమీపంలోని అంబేడ్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్లో జరిగే ‘సంవిధాన్ బచావో’ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీలు కూడా వెళ్తారు. సాయంత్రం తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.
Similar News
News October 14, 2025
వీటికి దూరంగా ఉంటే సంతోషమే!

మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇతరుల మీద ఫిర్యాదులు చేయడం, గుసగుసలు మాట్లాడటం, ఈర్ష్య, ఎదుటివారితో పోల్చుకోవడం, అతి వ్యసనాలు, అనుమానం, భయం, ద్వేషం’ వంటివి ‘మానసిక క్యాన్సర్ల’తో సమానం అని చెబుతున్నారు. ఇవి మన మనసును, శరీరాన్ని నెమ్మదిగా కుంగదీస్తాయంటున్నారు. వీటికి దూరంగా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటారని సూచిస్తున్నారు. మీరేమంటారు?
News October 14, 2025
రాశులు చెబుతున్న జీవిత పాఠాలు

మేషంలా తినాలి. వృషభంలా పౌరుషాన్ని ప్రదర్శించాలి. మిథునంలా కలిసిపోవాలి. కర్కాటకంలా పట్టు విడవకూడదు. సింహంలా పరాక్రమించాలి. కన్యలా సిగ్గుపడాలి. తులలా సమన్యాయం పాటించాలి. వృశ్చికంలా చెడుపై కాటేయాలి. ధనస్సులా లక్ష్యాన్ని ఛేదించాలి. మకరంలా దృఢంగా పట్టుకోవాలి. కుంభంలా నిండుగా ఉండాలి. మీనంలా సంసార సాగరంలో జీవించాలి.
☞ రోజువారీ మీ రాశిఫలాలను <<-se_10008>>జ్యోతిషం<<>> కేటగిరీకి వెళ్లి చూడొచ్చు.
News October 14, 2025
తిరుమల: సీఐడీ విచారణ మొదలు

AP: HC ఆదేశాలతో తిరుమల ఆలయంలోని పరకామణి చోరీ కేసు విచారణను CID ప్రారంభించింది. పరకామణి, ఆపై చోరీ కేసు నమోదైన తిరుమల వన్టౌన్ PSలో రికార్డులను చెక్ చేసింది. CID డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. 2023 MARలో 920డాలర్లు దొంగిలిస్తూ TTD ఉద్యోగి రవి పట్టుబడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై TTD పూర్తిస్థాయి దర్యాప్తు చేయలేదని పిల్ దాఖలు కాగా హైకోర్టు విచారణకు ఆదేశించింది.