News October 22, 2024
ఈరోజు సాయంత్రం కేరళకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్రెడ్డి ఈరోజు సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. రేపు వయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రేవంత్ కేరళ వెళ్తున్నారు. ఇదే కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. కాగా ఇక్కడ గెలిచిన రాహుల్ రాజీనామా చేయడంతో ఉపఎన్నిక జరుగుతోంది.
Similar News
News October 22, 2024
CRPF స్కూళ్లకు బాంబు బెదిరింపులు
దేశ వ్యాప్తంగా ఉన్న CRPF స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చాయి. ఇది ఆకతాయిలు చేసిన పనిగా తెలుస్తున్నప్పటికీ ఇటీవల ఢిల్లీలోని ఓ స్కూల్లో పేలుడు ఘటన కారణంగా ఆందోళన నెలకొంది. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను క్లాస్ రూమ్స్లో అమర్చినట్లు ఆ మెయిల్స్లో ఉంది.
News October 22, 2024
ఆ బ్లాంకెట్లు నెలకు ఒకసారే ఉతుకుతారు!
ట్రైన్స్లోని ఏసీ కోచుల్లో అందించే బ్లాంకెట్స్ను నెలకు ఒకసారి మాత్రమే ఉతుకుతారని ఆర్టీఐలో వెల్లడైంది. ఉన్ని దుప్పట్లను నెలకు ఒకసారి, కొన్నిసార్లు రెండుసార్లు అందుబాటులో ఉన్న సామర్థ్యం మేరకు ఉతుకుతామని రైల్వే శాఖ RTI ద్వారా TNIEకి తెలిపింది. గరీబ్ రథ్, దురంతో వంటి రైళ్లలో దుప్పట్లకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. దీంతో నిత్యం ప్రయాణికులు వాడేవాటిని ఉతక్కపోవడం ఏంటని నెటిజన్లు ఫైరవుతున్నారు.
News October 22, 2024
మూసీ కాంట్రాక్టు పొంగులేటికేనా?
TG: ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవం కాంట్రాక్టును మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు అప్పగించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అందుకే కొరియాలో పర్యటిస్తున్న బృందంలో పొంగులేటి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది.