News April 5, 2025
ఈనెల 15న జపాన్కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15న జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 23 వరకు అక్కడే ఉంటారు. వెస్టర్న్ జపనీస్ సిటీ ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ఆయనతో పాటు, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొననున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన ఉండనుంది.
Similar News
News November 8, 2025
60 ఏళ్ల వృద్ధుడు ₹1800 కోట్ల స్కామ్ వెలికితీత

MHలో Dy.CM అజిత్ పవార్ కుమారుడు పార్థ్ కంపెనీకి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం తీవ్రవివాదంగా మారింది. ₹1800CR విలువైన భూమిని ₹300CRకే కట్టబెట్టారు. ఈ స్కామ్పై ముందుగా దిన్కర్ కోట్కర్(60) IGR ఆఫీసుకు లేఖ రాసినా స్పందన రాలేదు. ఆ లేఖను తీసుకున్న ఓ సోషల్ యాక్టివిస్టు రికార్డులు టాంపర్ చేసినట్లు బయటపెట్టారు. అధికారుల విచారణలో అక్రమాలు నిజమని తేలడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది.
News November 8, 2025
ఎడ్యుకేషనల్ హబ్గా కుప్పం: సీఎం చంద్రబాబు

AP: కుప్పంలో రూ.2,203కోట్ల పెట్టుబడితో 7 సంస్థల ఏర్పాటుకు CM చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తాం. ప్రైవేట్, రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రోత్సహిస్తాం. ఇప్పటికే యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి’ అని తెలిపారు. కుప్పంలో ల్యాప్టాప్, మొబైల్ యాక్సెసరీస్ వంటి 7 సంస్థలకు ప్రభుత్వం 241 ఎకరాలు కేటాయించింది.
News November 8, 2025
హెలికాప్టర్ పేరెంటింగ్ గురించి తెలుసా?

పిల్లల జీవితాల్లో తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకునే విధానాన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. పిల్లల భవిష్యత్తు గురించి విపరీతమైన ఆందోళన చెందుతారు. ప్రతి సమస్య నుండి తమ బిడ్డను రక్షించడానికి సాయం చేయాలనుకుంటారు. అయితే వారి మితిమీరిన జోక్యం భవిష్యత్తులో పిల్లలకి సమస్యగా మారుతుందంటున్నారు నిపుణులు. పిల్లలను ఎదగనివ్వాలని, వారిని సొంతంగా నిర్ణయాలు తీసుకొనేలా ప్రోత్సహించాలని వారు చెబుతున్నారు.


