News August 25, 2025

నేడు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. వర్సిటీలో కొత్తగా నిర్మించిన హాస్టళ్ల ప్రారంభోత్సవంతో పాటు పలు భవనాల నిర్మాణాలకు సంబంధించి భూమి పూజలో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం ఓయూకు వెళ్లడం ఇదే తొలిసారి. అటు వర్సిటీ భూముల సర్వే, నియామకాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఓయూ కార్యక్రమం అనంతరం ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది.

Similar News

News August 25, 2025

భారత్‌పై కావాలనే టారిఫ్స్ పెంచారు: వాన్స్

image

రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ కావాలనే భారత్‌పై టారిఫ్స్ విధించారని US వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ తెలిపారు. ‘ఆయిల్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆపి రష్యన్స్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే INDపై సెకండరీ టారిఫ్స్ విధించారు. రష్యా హత్యలను ఆపకపోతే ఏకాకిగానే మిగిలిపోతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే కొత్తగా ఆంక్షలు విధించకుండా రష్యాపై ఎలా ఒత్తిడి తెస్తారని రిపోర్టర్ ప్రశ్నించగా సమాధానం దాటవేశారు.

News August 25, 2025

వరుస పండుగలు.. 22 స్పెషల్ ట్రైన్స్

image

దసరా, దీపావళి, ఛట్ పండగలకు 22 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. SEP 4-25 వరకు సికింద్రాబాద్, తిరుపతి మధ్య 4, కాచిగూడ-నాగర్ సోల్ మధ్య 4 సర్వీసులు, 5-26 వరకు తిరుపతి-సికింద్రాబాద్ 4, నాగర్ సోల్-కాచిగూడ 4 సర్వీసులు నడుస్తాయన్నారు. SEP 19-OCT 3 వరకు సంత్రాగ్జి-చర్లపల్లి మధ్య 3, SEP 20-OCT 4 వరకు చర్లపల్లి-సంత్రాగ్జి మధ్య 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.

News August 25, 2025

ఉమెన్ ‘జస్టిస్’లో తెలంగాణ టాప్

image

సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ ప్రకారం మహిళా న్యాయమూర్తుల సంఖ్యలో TG HC దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. 30 మంది జడ్జిలు ఉండగా వారిలో 10 మంది(33.3%) మహిళలే. ఆ తర్వాతి స్థానంలో సిక్కిం HCలో ముగ్గురు జడ్జిల్లో ఒక మహిళా న్యాయమూర్తి ఉన్నారు. ఈ జాబితాలో AP HC 9వ ప్లేస్‌లో ఉంది. 30 మంది జడ్జిల్లో ఐదుగురు మహిళలున్నారు. ఇక SCలో 33 మంది న్యాయమూర్తుల్లో ఇద్దరు మాత్రమే ఉమెన్ జడ్జిలు ఉండటం గమనార్హం.