News January 28, 2025
నేడు ప్రొద్దుటూర్కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూర్లో పర్యటించనున్నారు. అక్కడ 150 ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ‘ఎక్స్పీరియం పార్కు’ను ఆయన ప్రారంభిస్తారు. ఇదే కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి కూడా పాల్గొంటారు. కాగా రూ.450 కోట్ల వ్యయంతో రామ్దేవ్ రావు ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలు, చెట్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు.
Similar News
News November 2, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 16 ఉద్యోగాలు

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<
News November 2, 2025
ప్రతిరోజు తప్పక పఠించాల్సిన 4 మంత్రాలు

☞ ‘ఓం గం గణపతయే నమః’ రోజూ ఈ మంత్రం పఠించడం వల్ల అడ్డంకులు తొలగి, అంతర్గత శాంతి లభిస్తుంది.
☞ ‘ఓం నమః శివాయ’ ఈ పంచాక్షరీ మంత్రం ఏకాగ్రతను, సానుకూల శక్తిని, మానసిక బలాన్ని పెంచుతుంది.
☞ ‘ఓం హం హనుమతే నమః’ ఈ మంత్రం శారీరక బలంతో పాటు మీలో ధైర్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
☞ ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః’ ఈ మంత్ర జపం సంపద, శ్రేయస్సును కలిగిస్తుంది. మీకు బలాన్ని పెంపొందిస్తుంది
News November 2, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.


