News March 2, 2025
ఇవాళ సాయంత్రం టన్నెల్ వద్దకు సీఎం రేవంత్

TG: శ్రీశైలం SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో రేంజ్ ఐజీ సత్యనారాయణ భద్రతను పర్యవేక్షించనున్నారు. వారం రోజుల క్రితం పైకప్పు కూలిన ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారిని రక్షించేందుకు రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


