News February 26, 2025

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వినతులివే

image

☛ HYDలో మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమ‌తించాలి
☛ RRR ఉత్త‌ర భాగంలో 90% భూ సేక‌ర‌ణ పూర్త‌యినందున ద‌క్షిణ భాగాన్ని మంజూరు చేయాలి
☛ RRRకు స‌మాంత‌రంగా రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి
☛ మూసీ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల సాయం
☛ గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు 222.7ఎక‌రాల ర‌క్ష‌ణ భూముల బ‌దిలీకి సహకారం
☛ TGకి అదనంగా 29 IPS పోస్టులు మంజూరు చేయాలి
☛ సెమీ కండ‌క్ట‌ర్ల ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాలి

Similar News

News November 16, 2025

కార్తీకంలో నదీ స్నానం చేయలేకపోతే?

image

కార్తీక మాసంలో నదీ స్నానం చేయలేని భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. స్నానం చేసే నీటిలో గంగాజలం/నదీ జలాన్ని కలుపుకొని స్నానమాచరించవచ్చు. ఇది నదీ స్నానం చేసినంత పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. అది కూడా సాధ్యం కాకపోతే, స్నానం చేసేటప్పుడు ‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ…’ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా నదీ స్నానం చేసిన ఫలం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

News November 16, 2025

తెలంగాణ న్యూస్ అప్డేట్స్

image

*స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పార్టీపరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలని CM రేవంత్‌ను R.కృష్ణయ్య కోరారు. నేడు రాష్ట్రంలో BC న్యాయసాధన దీక్షలు చేయనున్నారు.
*BRS కార్యకర్తలపై తాము దాడి చేశామని KTR చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని జూబ్లీహిల్స్ MLAగా ఎన్నికైన నవీన్ యాదవ్ తెలిపారు.
*సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ACB మరోసారి దాడులు చేసింది. సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

News November 16, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* ఎర్ర చందనం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు డ్రోన్లతో పహారా కాస్తున్నట్లు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు DSP మహేంద్ర తెలిపారు. మరో 8 మంది నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
* గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్‌కు ఐదేళ్ల తర్వాత విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి.