News September 19, 2025
ఫిరాయింపులపై CM రేవంత్ కామెంట్.. చట్టం ఏం చెబుతోంది..?

రాజ్యాంగ సవరణ-52తో 1985లో చేర్చిన పదో షెడ్యూల్లో ఫిరాయింపుల గురించి ఉంది. శాసన సభ్యులు ఎన్నికైన పార్టీకి రిజైన్ చేస్తే ఫిరాయించినట్లు. ఓటింగ్కు హాజరుకావాలని విప్ జారీ చేస్తే రాకపోయినా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా స్పీకర్/ఛైర్మన్కు ఫిర్యాదు చేసి తొలగింపజేయొచ్చు. గెలిచాక మరో పార్టీలో చేరినా ఫిరాయింపే అని ఉన్నా.. <<17762540>>చేరారు<<>> అనే నిర్ధారణ వివరించలేదు. స్పీకర్ విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు.
Similar News
News September 19, 2025
మూడు వికెట్లు కోల్పోయిన భారత్

ఆసియా కప్: ఒమన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత 5 పరుగులు చేసి శుభమన్ గిల్ పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత 8వ ఓవర్లో అభిషేక్ శర్మ(38), హార్దిక్(1) ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అక్షర్(7), శాంసన్(28) ఉన్నారు. భారత్ స్కోర్ 84/3గా ఉంది.
News September 19, 2025
ఐదుగురు విద్యార్థులకు 9 మంది టీచర్లు!

TG: ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో సర్కారు బడుల్లో చేరే వారి సంఖ్య పెరగడం లేదు. మహబూబాబాద్(D) రాజులకొత్తపల్లి ZPHSలో ఐదుగురు విద్యార్థులకు 9మంది టీచర్లుండటమే ఇందుకు నిదర్శనం. ఈ స్కూలులో 6thలో ఒకరు, 7thలో ఇద్దరు, 8thలో ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. 9th, 10thలో ఒక్కరూ లేరు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలొస్తున్నాయి.
News September 19, 2025
ఓబుళాపురం మైనింగ్ కేసు.. సరిహద్దుల ఖరారుపై కమిటీ

AP: ఓబుళాపురం మైనింగ్ కేసులో సరిహద్దుల ఖరారుపై జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది. సరిహద్దు వివాదం ముగిసిందని, మైనింగ్ కొనసాగించడానికి గాలి బ్రదర్స్కి అనుమతి ఇవ్వాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.