News July 16, 2024

నేడు సీఎం రేవంత్ కీలక సమావేశం

image

TG: అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సీఎం రేవంత్ నేడు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఉ.9:30కు ప్రారంభమయ్యే ఈ మీటింగ్‌లో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, సీజనల్ వ్యాధులు, వనమహోత్సవం, విద్య, శాంతిభద్రతలు వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. మంత్రులు, సీఎస్, డీజీపీ, అన్ని శాఖల కార్యదర్శలు ఈ భేటీలో పాల్గొననున్నారు.

Similar News

News December 6, 2025

వేంకన్న గుడికి పట్నాలో 10.11 ఎకరాలు

image

పట్నాలో తిరుమల వేంకన్న గుడి నిర్మాణానికి 10.11 ఎకరాలను బిహార్ ప్రభుత్వం కేటాయించింది. ₹1 టోకెన్ రెంటుతో 99 ఏళ్ల లీజుకు ఈ భూమిని ఇచ్చింది. ఈమేరకు ఆ రాష్ట్ర CS ప్రతయ అమృత్ TTD ఛైర్మన్ బీఆర్ నాయుడికి లేఖ రాశారు. ఈ నిర్ణయంతో ఆ రాష్ట్రంలో టీటీడీ ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు అవకాశం ఏర్పడిందని నాయుడు తెలిపారు. త్వరలో ఆ రాష్ట్ర ప్రతినిధులను సంప్రదించి ఆలయ నిర్మాణానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

News December 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 88 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: విష్ణుమూర్తిని శ్రీనివాసుడు అని ఎందుకు పిలుస్తారు?
సమాధానం: విష్ణువును శ్రీనివాసుడు అని పిలవడానికి ప్రధాన కారణం.. ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి నివాసం ఉండటమే. ‘శ్రీ’ అంటే లక్ష్మీదేవి. ‘నివాస’ అంటే నివాసం. అలా లక్ష్మీదేవికి నిలయమైన ఆయనను శ్రీనివాసుడు అని పిలుస్తారు. ఈ పేరు భగవంతుడికి ఉన్న ప్రేమపూర్వకమైన, సంరక్షణతో కూడిన స్వభావాన్ని సూచిస్తుంది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 6, 2025

జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగన్‌కు దేవుడు, ఆలయాల పవిత్రత అంటే లెక్కలేదని మండిపడ్డారు. బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన ఆయన పరకామణి చోరీ కేసునూ సెటిల్ చేయాలని చూశారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.