News August 25, 2024
హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్లో చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి వాటికి హైడ్రా ద్వారా విముక్తి కల్పిస్తున్నామని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. HYDలో హరేకృష్ణ ఆధ్వర్యంలో అనంత శేష స్థాపన ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘చెరువులను ఆక్రమించినవారిని వదలం. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గం. అక్రమ నిర్మాణాలు కూలుస్తాం. కబ్జాదారులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చు. చెరువుల కోసం వారి భరతం పడతాం’ అని CM స్పష్టం చేశారు.
Similar News
News April 13, 2026
ఏ దేశపు పోర్టూ సురక్షితంగా ఉండదు: ఇరాన్

ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లే, వచ్చే అన్ని నౌకలను <<19635574>>దిగ్బంధిస్తామని<<>> యూఎస్ సైన్యం చేసిన ప్రకటనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ పోర్టులకు ముప్పు వాటిల్లితే ఏ దేశపు పోర్టూ సురక్షితంగా ఉండదని హెచ్చరించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై US ఆంక్షలు చట్టవిరుద్ధమని తెలిపింది. ఆ దేశ వైఖరి సముద్రపు దొంగల తరహాలో ఉందని మండిపడింది. హార్ముజ్ జలసంధిపై పట్టుకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు చేస్తామంది.
News April 13, 2026
వేతనం కోసం 16వేలమంది హోమ్ గార్డుల వెత

AP: పోలీస్, రవాణా, RTC విభాగాల్లోని 16వేల మంది హోమ్ గార్డులు జీతాల కోసం 10రోజులకు పైగా ఎదురుచూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. సాధారణంగా ప్రతినెల 1,2 తేదీల్లోనే వీరికి జీతం అందుతుంటుంది. ఈ శాఖల్లోని ఇతర ఉద్యోగులకు CFMS ద్వారా ఈనెల 11నే శాలరీ అందింది. వీరికి వేరే విభాగం నుంచి రోజుకు ₹710 చొప్పున నెలకు ₹21,300 వేతనం చెల్లించాల్సి ఉంది. కాగా సర్వర్ ఇష్యూతో జీతాలు ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.
News April 13, 2026
రాష్ట్రపతితో మంత్రి లోకేశ్ భేటీ

AP: కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రెసిడెంట్కు లోకేశ్ వివరించారు. అటు ఢిల్లీలో ఈనెల 30 నుంచి మే 10 వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ అధికారులకు మంత్రి సూచించారు.


