News October 3, 2024

పేదలపై సీఎం రేవంత్ ప్రతాపం: కిషన్ రెడ్డి

image

TG: ప్రజల ఆవేదన, మనోవేదనను అర్థం చేసుకుని కూల్చివేతలు ఆపాలని సీఎం రేవంత్‌కు లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పేదలపై రేవంత్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘డ్రైనేజీ సమస్య తీర్చకుండానే మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డ్రైనేజీ పైపులను మూసీలో కలుపుతున్నారు. కలుషితమైన నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

వాట్సాప్‌లో అందుబాటులోకి షెడ్యూల్ కాల్ ఫీచర్..

image

టీమ్స్, గూగుల్ మీట్ తరహా ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎంప్లాయీస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. వాయిస్‌తోపాటు వీడియో కాల్ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. కాల్ పెడుతున్న ఉద్దేశం చెప్పొచ్చు. ఎవరు కనెక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరేట్ అయిన లింకును కాపీ చేసి పార్టిసిపెంట్స్‌కు షేర్ చేయవచ్చు. కాల్ మొదలయ్యే ముందు పార్టిసిపెంట్స్‌కు నోటిఫికేషన్ వెళుతుంది.

News November 21, 2025

రిజర్వేషన్ల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం.. రేపే జీవో

image

TG: గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు GO ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన <<18332519>>నివేదికను<<>> రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రులకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.

News November 21, 2025

సీఎస్ పదవీకాలం పొడిగింపు

image

ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా 3 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2026 ఫిబ్రవరి వరకు విజయానంద్ సీఎస్‌గా కొనసాగనున్నారు. అనంతరం సాయిప్రసాద్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. అదే ఏడాది మేతో ఆయన పదవీకాలం కూడా ముగియనుంది.