News March 30, 2025

కేసీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

image

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలకు దిగారు. రైతులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని చెప్పి ఫామ్ హౌస్‌లో ఎకరాల కొద్దీ పండించారని అన్నారు. రూ.4,500కు క్వింటా చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. మూడేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే.. మూడేళ్లలోనే కూలిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కావాలనే శ్రీశైలం ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు.

Similar News

News April 1, 2025

దోమలు ఎక్కువగా ఎవరిని కుడతాయంటే?

image

దోమలు అందరిపై ఒకేలా దాడి చేయవు. ఎందుకంటే వాటికీ ఓ టేస్ట్ ఉంది. దోమలు ‘O’ గ్రూప్ రక్తాన్ని ఎక్కువగా ఇష్టపడతాయని ఓ పరిశోధనలో తేలింది. అందుకే O గ్రూప్ వ్యక్తులను ఎక్కువగా, A రకం వాళ్లని తక్కువగా కుడతాయి. అలాగే, చర్మంపై ఉండే బ్యాక్టీరియా కూడా కీలకం. అవి చెమటతో కలిసినప్పుడు విడుదల చేసే వాసన దోమలను ఆకర్షించడమో, తిప్పికొట్టడమో చేస్తుంటాయి. గర్భిణులు, వ్యాయామం చేసే వారిపై దోమల ప్రభావం ఎక్కువ అని తేలింది.

News April 1, 2025

400 ఎకరాలను న్యాయపరంగానే తీసుకుంటున్నాం: భట్టి

image

TG: HCU భూములను ప్రభుత్వం లాక్కుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని Dy.CM భట్టి విక్రమార్క ఖండించారు. విద్యార్థులు రాజకీయ ప్రభావానికి లోను కావొద్దని సూచించారు. ‘2004లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ 400 ఎకరాలకు బదులుగా 397 ఎకరాలను HCUకి మరో చోట కేటాయించింది. ఈ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నాం. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి’ అని సూచించారు.

News April 1, 2025

ALERT.. రేపటి నుంచి వర్షాలు

image

తెలంగాణలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుందని పేర్కొంది. దీంతో పాటు గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

error: Content is protected !!