News October 30, 2024
పార్టీ నేతలకు CM రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

TG: పార్టీని ఇబ్బంది పెట్టేలా స్టేట్మెంట్స్ ఇస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలకు CM రేవంత్, TPCC చీఫ్ మహేశ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. సమంతపై మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ల విషయంలో మాజీ MLA జగ్గారెడ్డి కామెంట్స్ దుమారం లేపిన విషయం తెలిసిందే.
Similar News
News December 7, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ ఎన్నికల వ్యయ పరిమితులు అమలు చేయాలి: ఎన్నికల వ్యయ పరిశీలకులు
✓ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
✓ మణుగూరు: BRS ప్రచార వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
✓ దమ్మపేట: కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన 45 కుటుంబాలు
✓ ఓటును నోటుకు మధ్యానికి అమ్ముకోవద్దు: పినపాక ఎస్సై
✓ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: భద్రాచలం ఎస్సై
✓ అశ్వరావుపేట: గుండెపోటుతో యూటీఎఫ్ నాయకుడు మృతి
News December 7, 2025
చలికాలంలో ఫ్యాన్ గాలికి పడుకుంటున్నారా?

చలికాలంలో ఫ్యాన్ గాలికి పడుకోవడం ఆరోగ్యానికి మేలు కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వలన చలి తీవ్రత పెరగడమే కాకుండా గొంతు నొప్పి, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చల్లగాలి శరీరాన్ని తాకితే ఉదయం నిద్రలేవగానే కండరాల బలహీనత ఏర్పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసి నిద్రకు ఆటంకం కలిగించడమే కాకుండా రోగనిరోధక శక్తిపై ప్రభావితం చూపిస్తుందంటున్నారు.
News December 7, 2025
జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్

TG: ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ వేడుకల్లో భాగంగా ఎల్లుండి ఉ.10 గంటలకు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్లోనూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.


