News June 27, 2024
డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకుని డీకే శివకుమార్కు అప్పగించాలని వక్కలిగ వర్గానికి చెందిన మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి చెప్పారు. బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ 515వ జయంతి ఉత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య సమక్షంలోనే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. డీకే కూడా వక్కలిగ వర్గమే. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Similar News
News January 16, 2026
పాలమూరుకు సీఎం రావడం శుభ పరిణామం: ఎమ్మెల్యే

పాలమూరు పట్టణం మున్సిపాలిటీగా ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తుండడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రేపు సీఎం జిల్లాకు రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు అభివృద్ధికి సీఎం ప్రత్యేకదృష్టి సారించారని తెలిపారు.
News January 16, 2026
రూ.238కోట్లు కలెక్ట్ చేసిన ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘రాజాసాబ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో రూ.238కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్ సైజ్ బ్లాక్బస్టర్’ అంటూ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించారు.
News January 16, 2026
ట్యాపింగ్ కేసు.. ఇంకెంతకాలం విచారిస్తారు: సుప్రీం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రభాకర్ రావు విచారణకు గడువు ఇప్పటికే పూర్తయిందని, ఇక అదనపు విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని సిట్ను ప్రశ్నించింది.


