News June 27, 2024
డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకుని డీకే శివకుమార్కు అప్పగించాలని వక్కలిగ వర్గానికి చెందిన మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి చెప్పారు. బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ 515వ జయంతి ఉత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య సమక్షంలోనే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. డీకే కూడా వక్కలిగ వర్గమే. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Similar News
News December 28, 2025
పిల్లల్లో డయాబెటీస్ ముప్పు తగ్గించాలంటే

డయాబెటిస్ సమస్య ఒకప్పుడు వృద్ధుల్లో కనిపించేది. ఇప్పుడు ఇది పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. పిల్లల్లో ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే, పిల్లలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలి. ఇంట్లో వండిన హెల్తీ ఫుడ్ పెట్టడం, ప్రతిరోజూ వ్యాయామం, స్వీట్లు, డ్రింక్స్ తగ్గించడం, ఫోన్, టీవీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
News December 28, 2025
సూర్య నమస్కారాలతో లాభాలివే..

పరమాత్మ స్వరూపమైన సూర్యుడికి సమర్పించే శక్తివంతమైన సాధనే సూర్య నమస్కారాలు. దీనివల్ల శరీరంలోని 12 చక్రాలు ఉత్తేజితమై, ప్రాణశక్తి ప్రవాహం మెరుగుపడుతుంది. సూర్య కిరణాల ప్రభావంతో మనసులో అశాంతి తొలగి, బుద్ధి ప్రకాశిస్తుంది. రోజూ నిష్టతో సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మనల్ని దైవత్వానికి దగ్గర చేస్తుంది.
News December 28, 2025
గుడ్ న్యూస్.. స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు!

TG: పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఏటా సగటున 12.55 లక్షల మంది e PASS వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటుండగా 2025-26లో ఈ సంఖ్య 7.65 లక్షలు మాత్రమే ఉంది. గడువు పొడిగింపుపై ఎల్లుండిలోగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.


