News June 16, 2024
పెట్రోల్ ధరల పెంపును సమర్థించిన సీఎం సిద్దరామయ్య

కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై CM సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం ప్రజా సేవలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుందన్నారు. చాలా రాష్ట్రాల కంటే కర్ణాటకలో పెంచిన ధరలు తక్కువేనని తెలిపారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాగా పెట్రోల్పై రూ.3, డీజిల్పై రూ.3.02లను కర్ణాటక ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ రూ.103, డీజిల్ రూ.89గా ఉంది.
Similar News
News March 28, 2026
మార్చి 28: చరిత్రలో ఈరోజు

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం
News March 28, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 28, 2026
బర్గర్ కంపెనీ బంపర్ గిఫ్ట్: ఉద్యోగులకు ₹15 కోట్ల బోనస్!

USకు చెందిన ప్రముఖ బర్గర్ చైన్ ‘ఫైవ్ గాయ్స్’ తన ఉద్యోగులకు సుమారు ₹15 కోట్ల బోనస్ ప్రకటించింది. సంస్థ 40వ వార్షికోత్సవం సందర్భంగా Feb 17న ఇచ్చిన ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్ల రద్దీ వల్ల స్టాక్ అయిపోవడం, ఆన్లైన్ సిస్టమ్స్ నిలిచిపోవడం వంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి. అయినా కమిటెడ్గా వర్క్ చేసిన 1,500 మంది ఉద్యోగులకు CEO జెర్రీ ముర్రెల్ ఈ నగదు బహుమతి అందించారు.


