News September 22, 2025
రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్న సీఎం!

TG: సింగరేణి ఉద్యోగులకు CM రేవంత్ రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్నట్లు సమాచారం. శాశ్వత ఉద్యోగులకు రూ. 1.90 లక్షలు, తాత్కాలిక ఉద్యోగులకు రూ. 5వేల వరకు బోనస్ లభించే అవకాశం ఉంది. అలాగే సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏటా బొగ్గు అమ్మకాలు, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా వచ్చే లాభాల నుంచి ఉద్యోగులకు బోనస్ ఇస్తోంది.
Similar News
News September 22, 2025
సెప్టెంబర్ 22: చరిత్రలో ఈరోజు

1936: దర్శకుడు విజయ బాపినీడు జననం
1948: రంగస్థల నటుడు, దర్శకుడు మల్లాది గోపాలకృష్ణ జననం
1952: రచయిత, కళాకారుడు అడివి బాపిరాజు మరణం
1987: సినీ నటుడు ఉన్నిముకుందన్ జననం(ఫొటోలో)
2004: సంగీత దర్శకుడు బి.గోపాలం మరణం
2009: నటి, గాయని ఎస్.వరలక్ష్మి మరణం
➤క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం
News September 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 22, 2025
అమల్లోకి కొత్త జీఎస్టీ.. తగ్గిన ధరలు

దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5%, 18% శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40% లిస్టులో చేర్చారు. ఆహారం, పాల ఉత్పత్తులు, FMCG, ఎలక్ట్రానిక్స్, వాహనాలతో పాటు సుమారుగా 200కు పైగా వస్తువుల ధరలు తగ్గాయి. ఇక దసరా సీజన్ కూడా మొదలవ్వడంతో కంపెనీలు మరింత ధరలు తగ్గించే అవకాశముంది. దీంతో షోరూమ్స్లో కొనుగోలుదారులతో సందడి నెలకొననుంది.