News September 11, 2025
ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో జరిగే ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం ఉ.9.30 గం.కు రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం సాయంత్రం అమరావతికి తిరిగి రానున్నారు.
Similar News
News February 17, 2026
రోడ్లు శుభ్రంగా లేకుంటే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తా: CM

TG: మున్సిపల్ అధికారులు, కమిషనర్లపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ‘త్వరలో GHMCలోని ప్రతి జోన్లో పర్యటిస్తా. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తా. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు పొద్దునే ఫీల్డ్లో ఉండాలి. చాలా మంది వెళ్లట్లేదు. అలాంటి అధికారులపై వేటు వేస్తా’ అని మున్సిపల్ శాఖ సమీక్షలో హెచ్చరించారు. GHMC 3 కార్పొరేషన్లలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
News February 17, 2026
నటికి చేదు అనుభవం.. వాష్రూమ్లో వీడియో తీసి బ్లాక్మెయిల్

ఓ కన్నడ టీవీ నటికి చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని ఓ ఇండోర్ స్టేడియంలో ఈవెంట్కు హాజరవగా అక్కడి వాష్రూమ్లో ఓ వ్యక్తి ఆమె వీడియోను రహస్యంగా చిత్రీకరించాడు. దానిని ఇన్స్టాలో పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 17, 2026
ఏఐ సాయంతో పిటిషన్లు.. సీజేఐ ఆందోళన

న్యాయవ్యవస్థలో ఏఐ వాడకంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు న్యాయవాదులు పిటిషన్లను ఏఐ సాయంతో రూపొందిస్తున్నారని పేర్కొంది. కల్పిత కేసులు/చట్టాలు, ఉనికిలో లేని జుడీషియల్ కోట్స్ను సమర్పిస్తున్నారని తెలిపింది. దీనివల్ల న్యాయ ప్రక్రియ సమగ్రత, నైతికతకు ముప్పు కలుగుతుందని, వృత్తిపరమైన సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించింది. ఈ రంగంలో ఏఐ వినియోగంపై నియంత్రణ అవసరమంది.


