News March 20, 2025

నేడు కుటుంబసమేతంగా తిరుమలకు సీఎం

image

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా నేడు తిరుమలకు వెళ్లనున్నారు. రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి ఒక్కరోజుకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఏటా దేవాన్ష్ పుట్టినరోజున చంద్రబాబు ఫ్యామిలీ ఇదే పద్ధతి అనుసరిస్తోంది.

Similar News

News March 20, 2025

వంశీకి మూడు రోజుల సీఐడీ కస్టడీ

image

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మూడు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని విచారించాలని సీఐడీ కోరగా 3వ ఏసీజేఏం కోర్టు ఆ మేరకు ఆదేశాలిచ్చింది. దీంతో ఈ నెల 22, 23, 24 తేదీల్లో విజయవాడలోని కార్యాలయంలో ఆయన్ను విచారించనున్నారు. ఈ కేసులో వంశీ ఏ71గా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళే విచారణ జరగనుంది.

News March 20, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 22మంది మావోయిస్టుల మృతి

image

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్- దంతెవాడ సరిహద్దుల్లోని అండ్రీ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 22 మంది మావోలు మరణించారు. ఎదురుకాల్పుల్లో ఒక జవాను చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో పలుమార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.

News March 20, 2025

సినీ ఇండస్ట్రీకి మహిళా కమిషన్ వార్నింగ్

image

TG: సినిమా పాటల్లో డాన్స్ స్టెప్స్ అసభ్యకరంగా, మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని రాష్ట్ర మహిళా కమిషన్ పేర్కొంది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే మాధ్యమమని, మహిళలను అవమానించే అంశాలు తీవ్ర ఆందోళనలకు గురిచేస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సినీ దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

error: Content is protected !!