News March 20, 2025
నేడు కుటుంబసమేతంగా తిరుమలకు సీఎం

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా నేడు తిరుమలకు వెళ్లనున్నారు. రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి ఒక్కరోజుకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఏటా దేవాన్ష్ పుట్టినరోజున చంద్రబాబు ఫ్యామిలీ ఇదే పద్ధతి అనుసరిస్తోంది.
Similar News
News November 28, 2025
ALERT.. పెరగనున్న చలి

ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి (<10°C) పడిపోతాయని, HYDలో 10°Cగా ఉండొచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ నెల 30 వరకు నార్త్, సెంట్రల్ TGలో 9-11°Cగా ఉంటాయన్నారు. తుఫాన్ ప్రభావంతో DEC 2-5 వరకు MHBD, భద్రాద్రి, సూర్యాపేట్, NGKL, వనపర్తి, MBNRలో మోస్తరు వర్షాలకు ఛాన్సుందని వివరించారు.
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


