News October 21, 2024

గ్రూప్1 అభ్యర్థులకు విషెస్ చెప్పిన CM

image

TG: మరికాసేపట్లో గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు చెప్పారు. ఎటువంటి ఆందోళన చెందకుండా, పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. ‘ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 8, 2025

పెద్దపల్లి: బిర్యానీ రూ.150.. టీ రూ.5..!

image

పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు జాగ్రత్తగా ఎన్నికల కమిషన్ సూచించిన పరిధిలో ఖర్చు చేయాలి. ఇందుకోసం కమిషన్ ఒక్క బిర్యాని ఖరీదు రూ.150, టీ రూ.5, ఇతర వస్తువుల ధరలు సైతం నిర్ణయించింది. సర్పంచ్ అభ్యర్థులు 5వేలలోపు ఓటర్లుగల గ్రామాలలో రూ.1,50,000, వార్డ్ సభ్యులు రూ.30,000లోపు.. అలాగే 5వేల జనాభా మించితే సర్పంచ్ రూ.2,50,000, సభ్యుడు రూ.50,000లోపు ఖర్చు చేయాలి. ఇవి మించితే అనర్హులే.

News December 8, 2025

ఈ హాస్పిటల్‌లో అన్నీ ఉచితమే..!

image

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్‌ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్‌ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.

News December 8, 2025

సరసమైన ధరలున్నా.. BSNLవైపు మళ్లట్లేదు!

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల రూ.485 ప్లాన్‌(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు BSNLవైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా BSNL ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్‌వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?