News January 27, 2025
CM రేవంత్ రెడ్డికి మెదక్ రైతు THANKS

మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా డబ్బులు బ్యాంకులో పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దేవసత్ బద్యానాయక్ అనే రైతుకు రూ.7 వేలు అకౌంట్లో జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో దామలచెరువులో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 14, 2025
బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్ను ఢీకొట్టిన కార్

HYDలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెం.1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్పాత్పైకి ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్ను కారు ఢీకొట్టింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఫెన్సింగ్తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. కాగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
News March 14, 2025
NZB: హోలీ ప్రత్యేకం.. పూర్ణం భక్ష్యాలు, నేతి బొబ్బట్లు

నిజామాబాద్ జిల్లా కేంద్రం సకల సంప్రదాయాలకు నిలయం. మహారాష్ట్ర సంప్రదాయం అధికం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలుగా మారిపోయే వేడుకంటే హోలీనే గుర్తొస్తుంది. ఈ వేళ విందు భోజనంలో నేతి బొబ్బట్లు, కోవా, కొబ్బరి, పూర్ణం భక్ష్యాలను చేసి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి స్థిర నివాసం చేసుకుంటుందని భక్తుల విశ్వాసం.
News March 14, 2025
MTM: గవర్నర్ని కలిసి కృష్ణా విశ్వవిద్యాలయం VC

కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి అబ్దుల్ నజీర్ను రాజ్ భవన్లో శుక్రవారం కలిశారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహణకు గవర్నర్ నుంచి అనుమతి కోరారు.