News April 6, 2024
CMPFలో అందుబాటులో ఆన్ లైన్ సేవలు
బొగ్గు గని కార్మికుల భవిష్య నిధి(CMPF) సంబంధించిన ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చాలాకాలంగా CMPF-ట్రస్ట్ బోర్డులో ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చర్చించిన మేరకు ఇటీవల C-కేర్ పోర్టల్ను అధికారులు ప్రారంభించారు. పింఛన్తో పాటు CNPF చెల్లింపులకు సంబంధించి ప్రతి అంశాల సేవలు ఆన్లైన్లో పొందే అవకాశం ఉంది. దీంతో రిటైర్డ్ కార్మికులకు పారదర్శకంగా సేవలు అందే అవకాశం ఏర్పడింది.
Similar News
News January 21, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేపటినుండి గ్రామసభలు. @ మెట్పల్లి మండలంలో బాలిక అదృశ్యం.. కేసు నమోదు. @ భీమదేవరపల్లి మండలంలో గంజాయి సేవిస్తున్న నలుగురిపై కేసు. @ ముత్తారం మండలంలో ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో పోలీసుల తనిఖీలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య. @ గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్.
News January 20, 2025
ఈనెల 28న కొత్తకొండ హుండీల లెక్కింపు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు
News January 19, 2025
సిరిసిల్ల: కూతురితో గొడవ.. తల్లి ఆత్మహత్య
ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వేముల నర్సవ్వ (45) ఇంట్లో కూతురితో గొడవ పడింది. దీంతో మనస్తాపం చెంది ఎదురుగా ఉన్న ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నర్సవ్వ కుమారుడు శేఖర్ ఆదివారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు.