News November 7, 2024
ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్యేలతో సీఎం చర్చ

AP: ఎస్సీ వర్గీకరణలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల ఎస్సీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు చర్చించారు. దళితుల్లోని ఉపకులాలన్నింటికీ దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా జిల్లా ఒక యూనిట్గా వర్గీకరణ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే వర్గీకరణ అమలు చేశామని, న్యాయ సమస్య కారణంగా అది నిలిచిపోయిందని సీఎం గుర్తు చేశారు.
Similar News
News December 11, 2025
నెల్లూరు: కార్పొరేటర్లు ఎవరి వశం?

నెల్లూరు రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్కడం లేదు. మేయర్ పదవి తమదేనని TDP నేతలు ధీమాగా ఉండగా.. YCP అవిశ్వాస తీర్మానం దగ్గర పడుతుండే కొద్దీ రాపిడి పెంచుతోంది. ఇప్పటికే నెల్లూరుతోపాటు, రూరల్ కార్పొరేటర్లకు YCP నేతలు టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఇరుపార్టీలు కార్పొరేటర్ల జపం చేస్తున్నాయి. ముందుకు పొతే గొయ్య, వెనక్కు పొతే నొయ్యా అన్నట్లు కార్పొరేటర్ల పరిస్థితి నెలకొంది.
News December 11, 2025
సర్పంచ్గా గెలిచిన చనిపోయిన అభ్యర్థి

TG: రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర సన్నివేశం వెలుగు చూసింది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా RRకాలనీ సర్పంచ్గా ఇటీవల మరణించిన చర్ల మురళి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై సుమారు 300కుపైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. నామినేషన్ అనంతరం మురళి మరణించడంతో గ్రామస్థులు ఆయనకే ఓటు వేశారు. దీంతో ఎన్నికల ఫలితంపై ఏం చేద్దామన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
News December 11, 2025
చనిపోయిన సర్పంచి అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

TG: మరణించిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి పలువురు అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ మండలం నడివాడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన బుచ్చిరెడ్డి ఈ నెల 9న గుండెపోటుతో మరణించారు. ఎన్నికల్లో అధికారులు ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయించారు. ఇవాళ జరిగిన పోలింగ్లో బుచ్చిరెడ్డికి 165 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి మరణించినా ఓటు వేయడం గమనార్హం.


