News November 7, 2024

ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్యేలతో సీఎం చర్చ

image

AP: ఎస్సీ వర్గీకరణలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల ఎస్సీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు చర్చించారు. దళితుల్లోని ఉపకులాలన్నింటికీ దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా జిల్లా ఒక యూనిట్‌గా వర్గీకరణ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే వర్గీకరణ అమలు చేశామని, న్యాయ సమస్య కారణంగా అది నిలిచిపోయిందని సీఎం గుర్తు చేశారు.

Similar News

News December 10, 2025

MLAల జీతాలు భారీగా పెంచిన ఒడిశా

image

ఒడిశాలో MLAల జీతాలు భారీగా పెరిగాయి. తమ జీతాన్ని దాదాపు మూడు రెట్లు పెంచే బిల్లుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. జీతం, అలవెన్సులతో కలిపి గతంలో నెలకు రూ.1.11లక్షలు ఉండగా ఇప్పుడు ఇది ఏకంగా రూ.3.45 లక్షలకు చేరింది. దీంతో దేశంలో MLA జీతం అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఇప్పటివరకూ ఈ స్థానంలో తెలంగాణ ఉండేది. ఇక్కడి శాసనసభ్యుల జీతం రూ.2.5లక్షలుగా ఉంది. MLA జీతం పెంపుపై మీ కామెంట్?

News December 10, 2025

పరువు హత్య కేసులో సంచలన విషయాలు

image

AP కృష్ణా జిల్లాకు చెందిన <<18523409>>శ్రవణ్<<>> సాయి(19) HYD శివారు మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. కొన్నాళ్లుగా టెన్త్ క్లాస్‌మేట్‌తో ప్రేమలో ఉన్నాడు. విషయం అమ్మాయి పేరెంట్స్‌కు తెలిసి హెచ్చరించారు. అయినా వినకపోవడంతో పెళ్లి గురించి మాట్లాడదామని అమ్మాయి తల్లి అతడిని ఇంటికి పిలిచింది. అక్కడ గొడవ జరగ్గా సాయిని బ్యాటుతో కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు.

News December 10, 2025

సర్పంచ్ ఎన్నికలు.. ఓటుకు రూ.4,000!

image

రేపు ఉదయం 7 గంటలకు TGలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు ఓట్ల ప్రలోభాల్లో జోరు పెంచారు. రాత్రికి రాత్రే ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఓటుకు రూ.1000-4000 పంచుతున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లి డబ్బులు చేతిలో పెట్టి, ఓటు వేయాలని దండం పెడుతున్నారు. ఇక లిక్కర్ క్వార్టర్లు, చికెన్ బిర్యానీల పంపిణీకి అడ్డే లేదు.