News July 17, 2024
3 విడతల్లో రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్

TG: రైతు రుణమాఫీని మొత్తం మూడు విడతల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. టీపీసీసీ నేతలతో ప్రజాభవన్లో ఆయన మాట్లాడారు. ‘రేపు సా.4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తాం. రూ.7వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్తాయి. ఈ నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు, ఆగస్టులో రూ.2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తాం. ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తవుతుంది’ అని వెల్లడించారు.
Similar News
News March 24, 2026
బుమ్రాకు గాయమా? MIకి టెన్షన్!

MI స్టార్ పేసర్ బుమ్రా IPL 2026 ప్రారంభానికి ముందు బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. టోర్నీ మొదలవ్వడానికి కొన్ని రోజులే ఉండగా ఆయన ముంబై క్యాంప్లో చేరడానికి బదులు అక్కడికి వెళ్లడం ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. రొటీన్ చెక్ అప్ కోసమా లేక ఏదైనా గాయమా అన్నది తెలియాల్సి ఉంది. ఆదివారం KKRతో జరగనున్న తొలి మ్యాచ్కు బుమ్రా అందుబాటులో ఉంటారా లేదా చూడాలి.
News March 24, 2026
మూసీ ప్రక్షాళన.. మార్పు మనతోనే మొదలవ్వాలి!

ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే మూసీ ప్రక్షాళన సాధ్యం కాదు. మన ఆలోచనా విధానం మారాలి. ప్లాస్టిక్ సహా ఇతర వ్యర్థాలను నేరుగా నదిలో వేయడం ఆపాలి. డ్రైనేజీ కనెక్షన్లను పద్ధతిగా ఉంచుకోవడం, నీటిని పొదుపుగా వాడుతూ మురుగును తగ్గించడం మన బాధ్యత. నదిని చెత్తకుప్పగా కాకుండా నగర జీవనాడిలా గౌరవించాలి. పౌరుల క్రమశిక్షణ, ప్రభుత్వ సంకల్పం తోడైతేనే స్వచ్ఛమైన మూసీ కల నెరవేరుతుంది.
News March 24, 2026
కొలంబియా విమాన ప్రమాదం.. 8 మంది మృతి!

కొలంబియా మిలిటరీ విమాన <<19460361>>ప్రమాదం<<>>లో 8 మంది మృతి చెందారు. సోమవారం 125 మందితో బయలుదేరిన హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. సుమారు 80 మంది గాయపడ్డట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరికొంత మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డట్లు వెల్లడించాయి. డ్రగ్ కార్టెల్స్ ఏరివేతలో భాగంగా సరిహద్దుకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది.


